Home / క్రికెట్
Chetan Sharma: భారత క్రికెట్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారం లేపుతున్నాయి. ప్రపంచ కప్ లో ఇండియా స్థాయిని తగ్గించేలా ఆయన మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. చేతన్ శర్మపై ఓ ఛానెల్ నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ లో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఎప్పుడూ అవినీతి అక్రమాలతో వార్తల్లో నిలుస్తోన్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కమిటీని రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
టీమ్ఇండియా సంచలన బ్యాటర్ శుభ్ మన్ గిల్ కు ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. గత రెండు సిరీస్ ల నుంచి సూపర్ ఫామ్ ను కొనసాగిస్తూ పరుగుల వరద పారిస్తున్న గిల్ ‘ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్’(జనవరి 2023) గా ఎంపికయ్యాడు.
టీంఇండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడనే వార్త ఇప్పుడు సంచలనంగా మారింది. హార్ధిక్ పాండ్యాకు ఇప్పటికే నటి, మోడల్ నటాషా స్టాంకోవిచ్ కు పెళ్లాడిన సంగతి తెలిసిందే.
Women Ipl: ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ వేలానికి సర్వం సిద్ధమైంది. ముంబై లోని జియో కన్వెన్షన్ సెంటర్ లో వేలం ప్రారంభమైంది. స్మృతి మంధాన కోసం.. ముంబయి- ఆర్సీబీ జట్లు పోటీపడ్డాయి. చివరికి 3.40 కోట్లకు ఆర్సీబీ దక్కించుకుంది.
CCL 2023: సినిమా, క్రికెట్ ఈ రెండంటే అభిమానులకు పిచ్చి. సినిమా అన్నా, క్రికెట్ అన్నా చూడటానికి అభిమానులు ఎదురు చూస్తారు. ఈ రెండింటికి విపరీతమైన అభిమానులు ఉంటారు. ఇప్పుడు ఈ రెండే ఒకటై వస్తున్నాయి. అదేనండి.. మన అభిమాన హీరోలు.. నటులు బ్యాటు పట్టుకొని స్టేడియంలోకి రాబోతున్నారు.
Womens T20: మహిళల టీ20 ప్రపంచకప్ లో భారత్ శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థిపై 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. జేమీమా అద్భుత బ్యాటింగ్ తో.. మరో 7 వికెట్లు ఉండగానే జయకేతనం ఎగరేశారు. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించింది. ఈ విజయంతో మహిళల టీ20 ప్రపంచకప్లో ఘనంగా తొలి అడుగు వేసింది.
IND vs AUS: నాగపూర్ వేదికగా జరిగిన మెుదటి టెస్టుపై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశాడు. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ ఒక్క సెషన్లోనే ఆలౌట్ అవుతుందని అస్సలు ఊహించలేదని రోహిత్ అన్నాడు. మెుదటి టెస్టులో భారత్ 132 పరుగుల ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది.
నాగపూర్ వేదికగా భారత్ - ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 132 పరుగుుల తేడాతో విజయం సాధించింది. 5 నెలల విరామం తర్వాత నాగ్ పూర్ టెస్ట్ లో పునరాగమం చేశాడు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా.
Ind Vs Aus 1st Test: Ind Vs Aus 1st Test: బోర్డర్- గావస్కర్ ట్రోఫీలో టీమిండియాకు శుభారంభం లభించింది. నాగ్ పూర్ వేదికగా జరిగిన తొలి టేస్టులో ఆస్ట్రేలియాను ఇన్సింగ్స్ 132 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంతో.. భారత్ టెస్టు సిరీస్లో 1-0తో ముందంజలో నిలిచింది. స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా బ్యాటర్లు చేతులెత్తేయడంతో మూడు రోజుల్లోనే ఆట ముగిసింది.