Home / పొలిటికల్ వార్తలు
ఏపీ హోం శాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత శుక్రవారం నాడు వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 2019 ఎన్నికల్లో గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా సుచరిత విజయం సాధించారు.
పవన్ కళ్యాణ్ గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని ఇప్పటం గ్రామంలోని బాధితుల పరామర్శకు వెళ్లారు. ఈ క్రమంలో ఆయన వాహనాలను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దానితో వాహనం దిగి ఆయన మూడు కిలోమీటర్ల మేర పాదయాత్రగా వెళ్లారు. "వైసీపీ గూండాల అరాచకాలు ఇలాగే సాగితో ఇడుపులపాయలో మీ ఇళ్ల మీద నుంచి హైవే వేస్తాం" అని పవన్ హెచ్చరించారు.
2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
నందిగామ పర్యటనలో ఉన్న తెదేపా జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయిపై గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరాడు.
తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షులుగా కాసాని జ్ఞానేశ్వర్ ను ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నియమించారు.
మరో మూడు రోజుల్లో తెలంగాణలో భారత్ జోడో యాత్ర ముగియనున్న నేపధ్యంలో దీనిపై నిజాంసాగర్ షుగర్ ఫ్యాక్టరీలో టీకాంగ్రెస్ నేతలు సమీక్షా సమావేశం నిర్వహించారు.