Home / పొలిటికల్ వార్తలు
తెలంగాణ సీఎం కేసిఆర్ ప్రధానమంత్రి నరేంద్ర మోదిని ఢీ కొట్టేందుకు పూర్తి స్థాయిలో సమాయత్తమౌతున్నారు. ఇందులో భాగంగానే తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు ప్రలోభాల డీల్ వ్యవహారాన్ని దేశ వ్యాప్తంగా చాటి చెప్పేందుకు పక్కా ప్లాన్ వేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు నిందితుల ఆడియో, వీడియో టేపులను అందరికి పంపించారు.
తెరాస ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేసి తమ పార్టీ వైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించారంటూ నమోదైన కేసులో నిందుతులు కీలక అంశాలు పేర్కొన్నట్లు సీఎం కేసిఆర్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటికి ఎనిమిది ప్రభుత్వాలను కూల్చామని, ఇప్పుడు ఇంకో నాలుగు ప్రభుత్వాలను కూల్చే పనిలో నిమగ్నమై ఉన్నామని నిందితులు తెలిపారన్నారు
తెలంగాణలోని మా రాజధాని హైదరాబాదుకు వచ్చి తెరాస పార్టీకి చెందిన శాసనసభ్యులను కొంటామంటే చేతులు ముడుచుకొని కూర్చోవాల్నా!? ప్రశ్నేలేదు..తాడో పేడో తేల్చుకొనేందుకు నేను రెడీ అంటూ సీఎం కేసిఆర్ కేంద్ర ప్రభుత్వం, భాజపాపై తీవ్ర విమర్శలు చేశారు.
2 సెంట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించారన్న కారణంగా తెల్లవారుజామున నానా హడావుడి చేసి తెదేపా నేత అయ్యన్న పాత్రుడితోపాటు కుమారుడు రాజేశ్ పై సీఐడి పోలీసులు పెట్టిన కేసులో 467 సెక్షన్ వర్తించదని కోర్టు తేల్చి చెప్పింది.
సివిల్ తగాదాకు, సీఐడీ పోలీసులకు ఉన్న సంబంధం ఏమిటని నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు ప్రశ్నించారు. సెంటు స్థల వివాదాన్ని సాకుగా చూపి మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని తెల్లవారుజామున వందమంది పోలీసులు గోడలు దూకి వచ్చి అరెస్టు చేయడం అమానుషమని మండిపడ్డారు.
అయ్యన్నపాత్రుడు బెయిల్ పిటిషన్ పై విచారణను హైకోర్టు శుక్రవారానికి వాయిదా వేసింది. అయ్యన్నను అక్రమంగా అరెస్ట్ చేశారని, నిబంధనలు పాటించలేదని అయ్యన్న తరపు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోళ్ల ప్రలోభాల డీల్ కేసుపై మంత్రి కేటిఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై త్వరలో పాన్ ఇండియా సినిమా తరహాలో చూస్తారని ఆయన అన్నారు. ఎవరూ ఊహించని, నిర్గాంతపోయే సన్నివేశాలు ఉంటాయని అన్నారు. ఈమేరకు కేసిఆర్ మీడియాతో ముచ్చటించారు.
జనసేన సుప్రీం ఇంటి వద్ద రెక్కీ చేస్తారా? పవన్ పై దాడులు చేద్దామనుకుంటారా? ఎవరిని బతకనివ్వరా? అందరిని చంపేస్తారా? అంటూ చంద్రబాబు ఘాటుగా స్పందించారు.
జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సొరేన్ బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి సవాల్ విసిరారు. నేరం చేసి ఉంటే తనను అరెస్ట్ చేయాలన్నారు. అంతేకానీ తనను ప్రశ్నించేలా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ను ప్రోత్సహించవద్దని అన్నారు
గుజరాత్ లో ఎన్నికల నగారా మోగగానే ప్రధాన పార్టీలు తమ తమ ప్రచారాన్ని ఉధృతం చేశాయి. గత కొద్ది రోజులుగా గుజరాత్ లో సుడిగాలి పర్యటనలతో ప్రజలను ఆప్ పార్టీవైపు తిప్పుకొనేందుకు అధినేత కేజ్రీవాల్ విభన్న ప్రకటనలు గుప్పిస్తున్నారు. వారిలో ఆలోచనలు రేకెత్తిస్తున్నారు.