Home / జాతీయం
కోల్కతాలోని ఒక దుర్గా మండపంలో 'మహిసాసురుడి స్థానంలో మహాత్మా గాంధీని పోలి ఉండేలా రూపొందించడం జాతిపిత జయంతి రోజున వివాదాన్ని సృష్టించింది.
అనేక కొత్తకొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీతో మార్కెట్లో ఇప్పటికే జియో సంచలనం సృష్టిస్తోంది. కాగా ఇప్పుడు ల్యాప్ టాప్ మార్కెట్లో రిలయన్స్ జియో సరికొత్త ఒరవడిని సృష్టించనుంది. సామాన్యుల బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలోనే అనగా రూ.15వేలలో ల్యాప్ ట్యాప్ను మార్కెట్లో విడుదల చేయనుంది.
దుర్గామాత పూజలో అపశ్రుతి చోటుచేసుకుంది. ప్రమాదవశాత్తు మంటలు చెలరేగి ముగ్గురు అగ్నికి ఆహుతయ్యారు. మరో 60 మంది గాయపడ్డారు. ఈ ప్రమాదం ఉత్తరప్రదేశ్లోని భదోహిలో చోటుచేసుకుంది.
భాజపా, ఏకనాధ్ షిండేల సంకీర్ణంతో ఏర్పడిన మహారాష్ట్ర సర్కారు కొత్త నిబంధనలు అమల్లోకి తెచ్చింది. పాశ్చాత్య భాషకు చరమగీతం పాడుతూ హలో అనే మాటకు బదులుగా వందేమాతరం అంటూ అభినందించాలంటూ కొత్త చట్టం తెచ్చింది
సుజ్లాన్ గ్రూప్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ తులసి తంతి మరణంపై ట్విట్టర్ స్పందించిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. విండ్ ఎనర్జీ వ్యాపారానికి మార్గదర్శకుల్లో తులసి తంతి ఒకరుగా పేర్కొన్నారు
సమాజ్ వాదీ పార్టీ వ్యవస్ధాపకుడు, రాజకీయ కురువృద్దుడు. ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్య పరిస్ధతి విషమంగా ఏర్పడింది. ఐసీయులో చికిత్స తీసుకొంటున్న ములాయం సింగ్ యాదవ్ పరిస్ధతి మరింత క్షీణించిన్నట్లు జాతీయ మీడియా కధనాలతో తెలుస్తుంది
మహాత్మ గాంధీ జయంతి వేడుకల్లో అధికార భాజపాపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విరుచుకపడ్డారు. గాంధీ వారసత్వం అంటూ అధికారంలో ఉన్న వారు మాట్లాడుతారే కాని ఆయన అడుగుజాడల్లో నడవడం అధికారంలో ఉన్నవారికి కష్టంగా పేర్కొన్నారు
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
పుదుచ్చేరిలో అంధకారం అలముకుంది. సామాన్య ప్రజల ఇళ్లకు కరెంట్ పోతే ఓకే. అదే రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు గవర్నర్ ఇళ్లు, కార్యాలయాలకే పవర్ కట్ అయ్యిందంటే అక్కడ విద్యుత్ సమస్యలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోండి. అదేంటి కేంద్రపాలిత ప్రాంతంలో పవర్ కట్ సమస్యేంటీ అనుకుంటున్నారు కదా. ఇది విద్యుత్ ఉద్యోగుల నిరసన సెగ వల్ల ఏర్పడిన కోతలు.
దేశం ఆయన వెంట నడిచింది. యావత్తు దేశం ఆయన మార్గమే దిక్కనింది. వేసిన ప్రతి అడుగు ఓ చుక్కానిలా మారింది. హింసలోనే అహింస దాగివుందని ప్రపంచానికి చాటి చెప్పేలా సాగింది ఆయన జీవిత ప్రయాణం. మరణం కాదు ముఖ్యం, శాసనం ప్రధానం అంటూ శత్రువుల గుండెల్లో శాంతి కపోతాలు ఎగరవేసిన ధైర్యశాలి ఆయన రూపం.