Home / జాతీయం
వారిద్దరూ ప్రాణంగా ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకుని జీవితాన్ని పంచుకోవాలని ఎన్నో కలలుగన్నారు. కానీ వారి జీవితాలతో విధి వింత గేమ్ ఆడింది. అనారోగ్యం బారినపడి ప్రియురాలు మృతి చెందింది. ప్రేయసి మరణవార్త విని తట్టుకోలేకపోయాడు. తనతో కలిసి జీవితం పంచుకోలేకపోయినా.. ఆమెనే పెళ్లాడాలని నిర్ణయించుకుని మృతదేహానికి తాళి కట్టి ఇకపై ఎవరినీ పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేశాడు.
సాధారణంగా ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థికి సానుభూతి చూపడం తప్ప గ్రామస్థులు కానీ రాజకీయనేతలుకు కానీ ఎవరూ పెద్దగా పట్టించుకున్న దాఖలాలు ఉండవు. కాగా హర్యానా రాష్ట్రంలో మాత్రం ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకొన్నది. ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థికి రోహతక్ జిల్లాలోని చిరి గ్రామస్థులు భారీ బహుమతులు అందజేశారు. అంతగా అతను ఏం చేశారు. ఎందుకు అతనిని ప్రజలు అంతగా ఆదరిస్తున్నారో చూసేద్దామా..
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై వ్యక్తిగత సహాయకుడు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని, అతని నుంచి రహస్య పత్రాలను సేకరించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.
ప్రధాని మోదీ శనివారం అరుణాచల్ ప్రదేశ్లోని ఇటానగర్లో మొదటి గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం, డోనీ పోలో ఎయిర్పోర్ట్ను ప్రారంభించారు. 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ను అంకితం చేశారు. ఫిబ్రవరి 2019లో ఆయన విమానాశ్రయానికి శంకుస్థాపన చేశారు.
మనీలాండరింగ్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న సుకేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్కు సంబంధించి మరో లేఖ విడుదల చేసాడు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాలకు షెడ్యూల్ విడుదలైంది. డిసెంబర్ 7 నుంచి 29వ తేదీ వరకు ఉభయ సభల శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ విషయాన్ని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి వెల్లడించారు.
అయ్యప్ప దర్శనానికి వెళ్లివస్తోండగా కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భక్తులతో వస్తోన్న ట్రావెల్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 18 మందికి గాయాలు అయ్యాయని అందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించినట్లు తెలుస్తోంది.
అక్రమ నగదు చలామణీ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, మంత్రి సత్యేందర్ జైన్ జైలు పాలయిన విషయం విధితమే. కాగా తాజాగా ఆయన ఢిల్లీలోని తీహార్ జైలులో ఉంటూ సర్వ సుఖాలు అనుభవిస్తున్నారంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.
ఇద్దరు అమ్మాయిల మధ్య గొడవకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. నడిరోడ్డుపైనే జుట్టుజుట్టు పట్టుకుని పొట్టుపొట్టున కొట్టుకున్నారు. వారి స్నేహితులు ఇద్దరిని విడదీసేందుకు ప్రయత్నించినా వారు మాత్రం ఏ మాత్రం తగ్గలేదు. ఈ ఘటన మహారాష్ట్ర నాసిక్లోని గంగాపూర్ రోడ్డులోని ఓ కళాశాలలో చోటుచేసుకుంది.
కేరళలోని కొచ్చిలో కామాంధులు రెచ్చిపోయారు. రన్నింగ్ కారులో 19 ఏళ్ల మోడల్ పై అత్యాచారానికి ఒడిగట్టారు. గురువారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.