Home / జాతీయం
ఉద్యోగం కోసం భూమి కుంభకోణానికి సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నాయకులు కిరణ్ దేవి మరియు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన అనేక రాష్ట్రాల్లోని తొమ్మిది ప్రదేశాలలో సోదాలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు.
'క్షణం', 'గూఢచారి', 'ఎవరు' చిత్రాలతో ప్రేక్షకుల్లో తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు "అడివి శేష్". 26/11 ముంబై దాడుల్లో వీరోచితంగా పోరాడి మరణించిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించిన సినిమా మేజర్. ఆ మూవీ లో అడవి శేష్ హీరోగా, సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటించింది.
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో ఉచిత విద్యుత్ హామీ ఇవ్వడంతో కర్ణాటకలోని చిత్రదుర్గ గ్రామస్థులు విద్యుత్ బిల్లులు చెల్లించడంలేదని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాల్వియా సోమవారం తెలిపారు. దీనికి సంబంధించి మాల్వియా ఒక వీడియోను పంచుకున్నారు.
రోజ్గార్ మేళా కింద, ప్రధాని నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మంగళవారం కొత్తగా చేరిన వారికి దాదాపు 71,000 అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేశారు. అపాయింట్మెంట్ లెటర్లను పంపిణీ చేసిన తర్వాత ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రభుత్వం యొక్క ప్రతి పథకం మరియు ప్రతి విధానం యువతకు కొత్త ఉపాధి అవకాశాలను సృష్టిస్తోందని అన్నారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంజాబ్ కోర్టు ఇవాళ సమన్లు జారీ చేసింది. 100 కోట్ల పరువు నష్టం కేసులో జులై 10 న న్యాయస్థానం ముందు హాజరు కావాలని సంగ్రూర్ కోర్టు ఖర్గేకు సమన్లు పంపింది.
ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత సత్యేందర్ జైన్ జైలు జీవితం తరచూ వివాదం రేపుతూనే ఉంది. తాజాగా ఆయన ఉంటున్న జైలు గదిలోకి ఇద్దరు ఖైదీలను తరలించడంపై తిహార్ జైలు సూపరింటెండెంట్కు నోటీసులు అందాయి.
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రి ఎవరన్నదానిపై కాంగ్రెస్ పార్టీ ఎటూ తేల్చుకోలేని స్థితిలో పడింది. సిఎం పదవి కావాలంటూ కర్ణాటక పిసిసి అధ్యక్షుడు డికె శివకుమార్, మాజీ సిఎం సిద్ధ రామయ్య పట్టుబడుతున్నారు. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న మాజీ సిఎం సిద్ధరామయ్య కాసేపట్లో రాహుల్ గాంధీతో సమావేశం కానున్నారు.
బాలీవుడ్ నటుడు షారూఖ్ ఖాన్ తన కొడుకు ఆర్యన్ ఖాన్ను డ్రగ్స్ కేసులో రక్షించడానికి రూ. 25 కోట్లు ఇవ్వాలని ఎన్సిబి అధికారులు బెదిరించారని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ఎఫ్ఐఆర్ దాఖలు చేసింది.
దుబాయ్-అమృత్సర్ విమానంలో మత్తులో ఎయిర్హోస్టెస్పై వేధింపులకు పాల్పడినందుకు ఓ మగ ప్రయాణికుడిని అరెస్టు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.పంజాబ్లోని జలంధర్లోని కోట్లి గ్రామానికి చెందిన రాజిందర్ సింగ్, ఎయిర్ హోస్టెస్తో తీవ్ర వాగ్వాదానికి దిగి శనివారం ఆమెను వేధించాడని పోలీసులు తెలిపారు.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కొత్త సీఎం ఎంపికలో కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది, ఆ రాష్ట్ర పీసీపీ చీఫ్ డికె శివకుమార్ మరియు సీనియర్ నాయకుడు సిద్ధరామయ్య ఇద్దరూ ముఖ్యమంత్రి స్థానాన్ని ఆశిస్తున్నారు.