Home / జాతీయం
పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి బుద్ధదేవ్ భట్టాచార్య కుమార్తె సుచేతన భట్టాచార్య లింగమార్పిడి శస్త్రచికిత్స (ఎస్ఆర్ఎస్) చేయించుకోనున్నట్లు ప్రకటించారు. ఇటీవల LGBTQ వర్క్షాప్కు హాజరైన సుచేతన, శస్త్రచికిత్సకు వెళ్లే ముందు అవసరమైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించింది.
కుండపోత వర్షాల కారణంగా అసోంలో అనేక నదులు. నీటి మట్టాలు ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తున్నాయి . దీనితో వరదల కారణంగా 20 జిల్లాల్లో దాదాపు 1.20 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) నివేదికల ప్రకారం అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (ASDMA) వరద నివేదిక ప్రకారం, బక్సా, బార్పేట, దర్రాంగ్, ధేమాజీ, ధుబ్రి, కోక్రాఝర్, లఖింపూర్, నల్బారి, సోనిత్పూర్ మరియు ఉదల్గురి జిల్లాల్లో 1,19,800 మందికి పైగా ప్రజలు వరద బారిన పడ్డారు.
PM Modi US Visit: ఒకరేమో ప్రపంచాన్నే శాశించగల అగ్రరాజ్యాధినేత, ఇంకొకరు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్ కు ప్రధాని మరి వీరిద్దరి కలకయిక జరుగుతుందంటే ప్రపంచ రాజకీయాల్లో ఎన్ని మార్పులు చేర్పులు చేసుకుంటాయా అని యావత్ ప్రపంచం ఎదురుచూస్తుంది.
గుజరాత్, మహారాష్ట్ర మరియు డామన్లలో దోపిడీ, హత్య మరియు మద్యం అక్రమ రవాణా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై దాడి చేసిన తరువాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ బుధవారం రూ. 1.62 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది
తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీకి బుధవారం ఉదయం కావేరి ఆసుపత్రిలో హార్ట్ కరోనరీ ఆర్టరీ బైపాస్ సర్జరీ జరిగింది. ఆపరేషన్ తర్వాత మంత్రి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆసుపత్రి అధికారులు తెలిపారు.
మణిపూర్లో కొనసాగుతున్న హింసాత్మక సంఘటనల నేపధ్యంలో శాంతిభద్రతలకు మరింత విఘాతం కలగకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్పై నిషేధాన్ని జూన్ 25 వరకు మరో ఐదు రోజులు పొడిగించింది. రాష్ట్రంలో కొనసాగుతున్న అశాంతి దృష్ట్యా డేటా సేవలను నిషేధించిన విషయం తెలిసిందే.
కోవిడ్ సెంటర్ స్కామ్ కేసుకు సంబంధించి మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) బుధవారం ముంబై మరియు సమీప ప్రాంతాలలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది.పరిశీలనలో ఉన్న సంస్థ లైఫ్లైన్ హెల్త్కేర్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్, శివసేన (UBT) నాయకుడు సంజయ్ రౌత్ సన్నిహితుడు సుజిత్ పాట్కర్తో సంబంధం కలిగి ఉంది.
International Yoga Day 2023: ప్రపంచమంతా నేడు 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలు జరుపుకుంటోంది. అమెరికా అధ్యక్షుడ్ జో బిడెన్ దంపతుల ఆహ్వానం మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ.. న్యూయార్క్ లో ఏర్పాటు చేసిన యోగా సెలబ్రేషన్స్లో పాల్గొన్నారు.
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ స్వామినాథన్ జానకిరామన్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా కేంద్రం మంగళవారంనాడు నియమించింది. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్ల పాటు లేదా తదితర ఉత్వర్వులు వెలువడేంత వరకూ ఆయన ఈ పదవిలో కొనసాగుతారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన జగన్నాథ రథయాత్ర మంగళవారం ఒడిశాలోని పూరీలో పవిత్రమైన ‘పహండి’ ఆచారాలతో ప్రారంభమైంది. జగన్నాథుని రథయాత్ర ఉత్సవానికి దాదాపు 25 లక్షల మంది ప్రజలు వస్తారని శ్రీ జగన్నాథ ఆలయ అడ్మినిస్ట్రేషన్ (ఎస్జెటిఎ ) అంచనా వేసింది.