Home / జాతీయం
ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నీలేకని తన విద్యా సంస్థ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT)బాంబే కి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రూ.315 కోట్లను విరాళంగా ఇచ్చారు. నీలేకని 1973లో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ కోసం ఇన్స్టిట్యూట్లో చేరారు.
బాలాసోర్ రైలు ప్రమాదంపై విచారణ జరుపుతున్న సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం బాలాసోర్లోని సోరో సెక్షన్ సిగ్నల్ జూనియర్ ఇంజనీర్ ఇంటికి సీలు వేసింది. బాలాసోర్లోని అద్దె ఇంట్లో నివసించిన ఇంజనీర్ను దర్యాప్తు సంస్థ ప్రశ్నించింది. అయితే అతను ఇప్పుడు తన కుటుంబంతో అదృశ్యమయ్యాడు.
భారత రీసెర్చ్ అండ్ అనలసిస్ వింగ్ అధిపతిగా ఐపిఎస్ అధికారి రవి సిన్హాని నియమించారు. ఈ మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత రా చీఫ్ సామంత్ గోయల్ పదవీకాలం ఈ నెల 30తో ముగియనుంది. ఆ తరువాత రవిసిన్హా పదవీ బాధ్యతలు స్వీకరిస్తారు.
బిపర్ జోయ్ తుఫాను రాజస్థాన్లోని నాలుగు జిల్లాలను తాకడంతో ఆదివారం నగరంలో కురిసిన భారీ వర్షం కారణంగా అజ్మీర్లోని జవహర్లాల్ నెహ్రూ ఆసుపత్రిలోకి వరదనీరు చేరింది.ఆసుపత్రిలో నీరు నిలిచిపోవడంతో సిబ్బంది తమ విధులను నిర్వర్తించడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అమర్నాథ్ యాత్రలో పాల్గొనేందుకు ఎక్కువ మందిని ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో, హోటల్స్ బుకింగ్ గదులపై అదనపు తగ్గింపులను అందించాలని ఆల్ జమ్మూ హోటల్స్ అండ్ లాడ్జెస్ అసోసియేషన్ నిర్ణయించింది.
ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్కు చెందిన పబ్లిషర్ గీతా ప్రెస్కి 2021కి గాను గాంధీ శాంతి బహుమతిని ప్రదానం చేయడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ ఈరోజు కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని జ్యూరీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అపహస్యంగా పేర్కొన్నారు.
చెన్నై నగరంలో ఆదివారం అర్దరాత్రినుంచి కుండపోతగా కురుస్తున్న వర్షాలతో వేలచేరి, గిండి, వేపేరి, జిఎస్టి రోడ్ మరియు కెకె నగర్ వంటి లోతట్టు ప్రాంతాలలో నీరు నిలిచిపోయింది. చెన్నై విమానాశ్రయంలో దిగాల్సిన పది విమానాలను సోమవారం తెల్లవారుజామున బెంగళూరు విమానాశ్రయానికి మళ్లించగా, 17 అంతర్జాతీయ విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.
: లక్నోలోని నిగోహన్ రైల్వే స్టేషన్లో శనివారం తీవ్రమైన వేడి కారణంగా లూప్లైన్లోని రైల్వే ట్రాక్లు కరిగిపోవడంతో పెద్ద రైలు ప్రమాదం తప్పింది.శనివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో నీలాంచల్ ఎక్స్ప్రెస్ మెయిన్ లైన్కు బదులుగా లూప్ లైన్ గుండా వెళ్లడంతో ట్రాక్లు కరిగిపోయి వ్యాపించడంతో ఈ ఘటన జరిగింది.
డబ్ల్యుఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై తమ నిరసన రాజకీయ ప్రేరేపితమైనది కాదని రెజ్లర్ సాక్షి మాలిక్ మరియు ఆమె భర్త సత్యవర్త్ కడియన్ చేసిన ప్రకటనపై మాజీ రెజ్లర్ బబితా ఫోగట్ ఆదివారం నాడు మండిపడ్డారు. వారు కాంగ్రెస్ చేతిలో కీలుబొమ్మగా మారారని కూడా ఆమె ఆరోపించారు.
ప్రభాస్ నటించిన ఆదిపురుష్ శుక్రవారం భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. వరోవైపు సినిమాలోని కొన్ని డైలాగులు వివాదానికి దారి తీసాయి. సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న భారీ ఆగ్రహానికి ప్రతిస్పందించిన మేకర్స్, ప్రేక్షకుల మనోభావాలను పరిగణనలోకి తీసుకొని డైలాగ్లను సవరించాలని నిర్ణయం తీసుకున్నారు.