Home / తప్పక చదవాలి
లడఖ్లో బైక్ యాత్రలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఖర్దుంగ్లా పర్వత మార్గం వద్దకు చేరుకున్నారు. తూర్పు లడఖ్లోని పాంగోంగ్ సరస్సులో రాహుల్ తన తండ్రి దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతిని జరుపుకున్నారు.
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ బ్యాంకు ఆఫ్ బరోడా నుంచి రుణం తీసుకొని తిరిగి చెల్లించకపోవడంతో ఆయనకు బ్యాంకు నోటీసులు పంపించింది. బకాయిలు వసూలు చేయడానికి మీ విల్లాను వేలం వేస్తున్నట్లు నోటీసు పంపించింది. ఆదివారం నాడు బాలీవుడ్తో పాటు జాతీయ మీడియాలో ఈ వార్త పతాకశీర్షికను ఆకర్షించింది.
బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ ) ఆగస్ట్ 30న ప్రారంభం కానున్న ఆసియా కప్ 2023 కోసం 17 మంది సభ్యులతో కూడిన జట్టును సోమవారం ప్రకటించింది. ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్థాన్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.సెప్టెంబరు 2న శ్రీలంకలోని క్యాండీలో పాకిస్థాన్తో జరిగే మ్యాచ్తో భారత్ టోర్నమెంట్లో అడుగుపెట్టనుంది.
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసిఆర్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను 115 నియోజకవర్గాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను ప్రకటించారు. సోమవారం ఆయన బీఆర్ఎస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ కేవలం నాలుగు నియోజకవర్గాలను మాత్రమే పెండింగ్లో పెట్టామని, ఏడు స్థానాల్లో మాత్రమే సిట్టింగ్లను మార్చినట్లు చెప్పారు.
తన స్నేహితుడి 14 ఏళ్ల కుమార్తెపై నెలల తరబడి అత్యాచారం చేసి గర్భం దాల్చినందుకు ఢిల్లీలోని మహిళా శిశు అభివృద్ధి శాఖ ప్రభుత్వ అధికారిపై ఆదివారం కేసు నమోదైంది. అతడినిఅరెస్ట్ చేసేందుకు ఢిల్లీ పోలీసులు ప్రభుత్వ అధికారి నివాసానికి చేరుకున్నారు.
మల్కాజ్గిరి బిఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మంత్రి హరీష్ రావుపై ఫైరయ్యారు. హరీష్ రావు తన గతాన్ని గుర్తుంచుకోవాలని హనుమంతరావు హితవు పలికారు. తిరుమలలో శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
ఆదివారం అర్థరాత్రి సెంట్రల్ నైజీరియాలో ముష్కరులు జరిపిన ఆకస్మిక దాడిలో నైజీరియా భద్రతా దళాలకు చెందిన కనీసం 26 మంది మరణించగా ఎనిమిది మంది గాయపడినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. గాయపడిన వారిని రక్షించే హెలికాప్టర్ సోమవారం ఉదయం క్రాష్ అయ్యిందని, ఇక్కడ సైన్యం క్రిమినల్ గ్రూపులతో పోరాడుతున్నదని వైమానిక దళ ప్రతినిధి చెప్పారు.
మంగళవారం జపాన్లోని ప్రధాన ద్వీపం హోన్షు లోని కొన్ని ప్రాంతాల్లో బలమైన గాలులు, భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తమయింది. సెంట్రల్ మరియు వెస్ట్రన్ రీజియన్లలో "ఆగస్టు నెలలో సాధారణ వర్షపాతం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయిందని జపాన్ వాతావరణ సంస్థ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ X లో తెలిపింది.
సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు మరియు సామాజిక కార్యకర్త బిందేశ్వర్ పాఠక్ గుండెపోటుతో ఢిల్లీలోని ఎయిమ్స్లో మంగళవారం మరణించారు. 80 ఏళ్ల పాఠక్ భారతదేశంలో పబ్లిక్ టాయిలెట్లను నిర్మించడంలో పలువురికి మార్గదర్శకుడు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఉదయం జాతీయ జెండాను ఎగురవేసిన పాఠక్ ఆ వెంటనే కుప్పకూలిపోయాడని సన్నిహితుడు తెలిపారు.
1997లో ప్రజా గాయకుడు గద్దర్పై జరిగిన కాల్పుల ఘటనలో తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అన్నారు. కాల్పుల అనంతరం గద్దర్ తనతో పలుమార్లు మాట్లాడారని ఆయన స్పష్టం చేశారు. అల్వాల్లోని ప్రజా గాయకుడు గద్దర్ నివాసానికి వెళ్ళిన చంద్రబాబు నాయుడు నివాళులర్పించారు. గద్దర్ కుటుంబ సభ్యులని పరామర్శించారు.