Home / తప్పక చదవాలి
మార్గదర్శి చిట్ ఫండ్ ఛైర్మన్ రామోజీరావుపై ఏపీ సీఐడీకి మరో ఫిర్యాదు అందింది. మార్గదర్శిలో తనకు రావాల్సిన షేర్లు ఇవ్వకుండా తుపాకీతో బెదిరించారని మార్గదర్శిలో పెట్టుబడి పెట్టిన జి.జగన్నాథరెడ్డి కుమారుడు యూరిరెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు.
స్వలింగ జంటల వివాహానికి (LGBTQIA+ కోసం వివాహం) చట్టపరమైన ధ్రువీకరణ కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు మంగళవారం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన తీర్పును వెలువరించింది. అత్యున్నత న్యాయస్థానంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం క్వీర్ వ్యక్తుల లైంగిక ధోరణి ఆధారంగా వారి పట్ల వివక్ష చూపకుండా చూసుకోవాలని కేంద్రం మరియు రాష్ట్రాలను ఆదేశించింది.
కృష్ణా డెల్టాలో ఎండిపోతున్న పంటలు చూసినా ప్రభుత్వానికి చీమ కుట్టినట్లైనా లేదని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. ఏపీ ముఖ్యమంత్రికి ప్రణాళిక లేకపోవటం వల్లే రాష్ట్రంలో పంటలకు సాగునీరు అందక ఎండిపోతున్నాయని గుంటూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
డిసెంబర్ లోగా విశాఖకు మారతామని ఇక్కడినుంచే పరిపాలన కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. సోమవారం వివాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తాను త్వరలోనే విశాఖకు షిప్ట్ అవుతానని, పరిపాలనా విభాగం మొత్తం విశాఖకు మారుతుందని చెప్పారు.
భారతదేశంలో ప్యాసింజర్ వాహనాల టోకు విక్రయాలు గత నెలలో 1.87 శాతం పెరిగి 3,61,717 యూనిట్లకు చేరుకున్నాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్) సోమవారం తెలిపింది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో ప్యాసింజర్ వాహనాల పంపకాలు 3,55,043 యూనిట్లుగా ఉన్నాయి.
హాస్పిటాలిటీ టెక్నాలజీ సంస్థ ఓయో సోమవారం తన వచ్చే మూడు నెలల్లో 750 హోటళ్లను తమ ప్లాట్ ఫామ్ లో చేరుస్తున్నట్లు తెలిపింది. గోవా, జైపూర్, ముస్సోరీ, రిషికేశ్, కత్రా, పూరీ, సిమ్లా, నైనిటాల్, ఉదయపూర్, మౌంట్ అబూ మార్కెట్లపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపింది.
ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, సెప్టెంబర్లో వరుసగా ఆరవ నెలలో భారతదేశ టోకు ద్రవ్యోల్బణం ప్రతికూల స్థాయిలోనే ఉంది.సెప్టెంబర్లో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 0.26 శాతం క్షీణించింది.
గాజా పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రం కావడంతో పలువురు నివాసితులు ఆసుపత్రులు మరియు పాఠశాలల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇజ్రాయెల్ భూ దాడులకు దిగుతుందన్న సమాచారంతో మిలియన్ల మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి పారిపోయారు.
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిఠారీ హత్యలకేసులో నిందితులు సురేంద్ర కోలీ, మోనీందర్ సింగ్ పంధేర్ ఇద్దరిని నిర్దోషులుగా అలహాబాద్ హైకోర్టు ప్రకటించింది. సరైన సాక్ష్యాధారాలు లేనందున వీరిద్దరిని నిర్దోషులుగా పరిగణిస్తున్నట్లు తెలిపింది.
ప్రధాని నరేంద్ర మోదీ మణిపూర్లో జరుగుతున్న హింసాకాండ కంటే ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సోమవారం ఆయన మిజోరంలో మాట్లాడుతూ ఇజ్రాయెల్లో ఏమి జరుగుతుందనే దానిపై ప్రధానమంత్రి మరియు భారత ప్రభుత్వానికి చాలా ఆసక్తి ఉంది. కానీ మణిపూర్లో ఏమి జరుగుతుందో దానిపై అస్సలు ఆసక్తి చూపకపోవడం ఆశ్చర్యంగా ఉందని అన్నారు.