Home / తప్పక చదవాలి
బీహార్ అసెంబ్లీ గురువారం రిజర్వేషన్ సవరణ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. ఎస్సీ, ఎస్టీలు, ఇతర వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన తరగతులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటాను ప్రస్తుతమున్న 50 శాతం నుంచి మొత్తం 75 శాతానికి పెంచే ప్రతిపాదనను బీహార్ కేబినెట్ ఆమోదించింది.
మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారంలో అపశృతి చోటు చేసుకుంది. ఆర్మూరు ఎన్నికల ప్రచారంలో ఉండగా కేటీఆర్ ప్రచార రధం నుంచి కింద పడటంతోస్వల్ప గాయాలయ్యాయి. డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ప్రచార రధం రెయిలింగ్ ఊడిపోయి కేటీఆర్ కింద పడ్డారు. కేటీఆర్ తో పాటు ఎంపీ సురేశ్ రెడ్డి, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కూడ కింద పడటంతో వారికి కూడా గాయాలయ్యాయి.
లోక్ సభలో ప్రశ్నకు నోటు వ్యవహారం జాతీయ రాజకీయాల్ని కుదిపేస్తోంది. పారిశ్రామిక వేత్త దర్శన్ హీరానందానీకి తన లోక్ సభ లాగిన్ ఐడీ షేర్ చేయడం ద్వారా ప్రశ్నకు నోటు తీసుకుంటున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రాను లోక్ సభ నుంచి బహిష్కరించాలని ఎథిక్స్ కమిటీ సిఫార్సు చేసింది. తాజాగా ఈ వ్యవహారంపై విచారణ జరిపిన ఎథిక్స్ కమిటీ ముసాయిదా నివేదికను సమర్పించింది.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 8మంది అభ్యర్థులకి జనసేనాని పవన్ కళ్యాణ్ బి ఫాంలని అందజేశారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికల బరిలోకి దిగుతోంది. ఈ పొత్తులో భాగంగా.. జనసేనకు 8 సీట్లను కూడా బీజేపీ కేటాయించింది. అయితే.. ఆ సీట్లకు సంబంధించిన అభ్యర్థులను జనసేన అధిష్టానం ప్రకటించింది.
గత వారం గాజా నుండి తరలించబడిన ఒక అమెరికన్ నర్సు యుద్ధం తో దెబ్బతిన్న గాజాలో తన అనుభవాలను వివరించింది, ఆహారం మరియు నీటి కొరత కారణంగా ఆమె మరియు ఆమె బృందం దాదాపు ఆకలితో చనిపోయే పరిస్దితికి వచ్చామని చెప్పింది. ఇజ్రాయెల్ నిరంతరం బాంబు దాడులు చేయడంతో శరీరాలపై తీవ్రమైన కాలిన గాయాలతో ఉన్న పిల్లలను తాను చూశానని ఆమె చెప్పింది.
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) బుధవారం నాడు గాజాలో తాము నిర్వహించిన వైమానిక దాడులలో హమాస్ ఆయుధాల ఉత్పత్తి విభాగానికి నాయకుడిగా వ్వయహరిస్తున్న కమాండర్ ను హతమార్చినట్లు తెలిపింది. ఐడిఎఫ్ ఫైటర్లు గాజా స్ట్రిప్లో Xఉగ్రవాదులను నిర్మూలించడం మరియు తీవ్రవాద స్దావరాలపై దాడి చేయడానికి విమానాలను ప్రయోగించాము.
చెన్నై నుంచి ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్కు వెళ్లే తమిళనాడు సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులు మృతదేహంతో పాటు సుమారు 600 కి.మీ. ప్రయాణించవలసి వచ్చింది. రైలు జనరల్ కోచ్లో ఒక వ్యక్తి మరణించినా రైల్వే అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో ఈ పరిస్దితి తలెత్తింది.
దేశ రాజధాని ఢిల్లీలో పొల్యూషన్ రోజురోజుకు పెరిగిపోతుంది. పొల్యూషన్ కంట్రోల్ కోసం ఢిల్లీ ప్రభుత్వం పలు నిర్ణయాలు తీసుకుంది.సుప్రీంకోర్టు వ్యాఖ్యల తర్వాత ఇతర రాష్ట్రాల్లో నమోదు చేసుకున్న యాప్ ఆధారిత క్యాబ్ల ప్రవేశంపై నిషేధం విధిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది.
ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ పుణ్యక్షేత్రంలో మంగళవారం కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, బీజేపీ ఎంపీ వరుణ్గాంధీ మధ్య అనూహ్య భేటీ జరిగింది. వీరిద్దరూ ప్రార్థనల కోసం కొండపైనున్న ఆలయానికి వెళ్లినపుడు అనుకోకుండా కలసుకున్నారు.
: జనాభా నియంత్రణలో మహిళల విద్య కీలకపాత్ర వహిస్తుందంటూ బీహార్ సీఎం, జెడి(యు) నేత నితీష్ కుమార్ చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేకెత్తించడంతో బుధవారం బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. తర్వాత ఆయన తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పినా బీజేపీకి చెందిన ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేసి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.