Home / తప్పక చదవాలి
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీ జిల్లాలో నిర్మాణంలో ఉన్న టన్నెల్ కూలిపోవడంతో సుమారుగా 40 మంది కార్మికులు సొరంగంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది.నేషనల్ మరియు స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలే మరియు పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాలో సైనికులతో కలిసి దీపావళిని జరుపుకున్నారు.దేశం పట్ల వారి త్యాగం మరియు అంకితభావానికి వారిని కొనియాడారు. వీరులకు భారతదేశం కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని అన్నారు. హిమాచల్లో బలగాలతో గడిపిన సమయం లోతైన భావోద్వేగం మరియు గర్వంతో నిండి ఉందని చెప్పారు.
దీపం పరబ్రహ్మ స్వరూపంగా ఆరాధించే హిందువులకు విశిష్టమైన దీపావళి పండుగ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. చీకటి నుంచి వెలుగుల వైపు నడిపించేదే దీప జ్యోతి.. అటువంటి ఈ దీపాల పండుగ ప్రజలందరికీ సౌభాగ్యాన్ని ప్రసాదించాలని భగవంతుణ్ణి కోరుకుంటున్నానని అన్నారు.
హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్కి బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు.
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వాన్ని సాగనంపడానికి తెలంగాణ ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.
దేశ రాజధాని ఢిల్లీని పట్టి పీడిస్తున్న వాయు కాలుష్యంపై దాఖలైన పిటిషన్ల విచారణ సందర్భంగా శుక్రవారం సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. కాలుష్యం కట్టడిపై కేజ్రీవాల్ సర్కార్ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది. కాలుష్యానికి ప్రధాన కారణం పంట వ్యర్థాలు తగలబెట్టడమేనా అన్న అంశంపై విచారిస్తుండగా.. పొరుగు రాష్ట్రాల్లో వరిగడ్డిని కాల్చడాన్ని కట్టడి చేయడంలోనూ ప్రభుత్వం విఫలమవుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో పోటీదారులందరిలో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. రాజగోపాల్రెడ్డి గురువారం నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అధికారుల ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు, తన భార్య లక్ష్మికి రూ.458.37 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. అనేక ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇక విషయానికొస్తే.. ఆమె పక్కన సోదరుడు తప్ప మరెవరూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయకుడు కూడా లేరు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంతకన్నా లేరు.
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి 20 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని చూస్తోంది. గత ఏడాది దీపావళి సందర్భంగా 15.76 లక్షల దీపాలను వెలిగించి రికార్డు సృష్టించారు. ఈసారి, మరో రికార్డు సాధించడానికి 51 ఘాట్లలో దీపాలు వెలిగించబడతాయి.
దోమల ద్వారా వ్యాపించే చికున్గున్యా కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ను యూఎస్ ఆరోగ్య అధికారులు గురువారం ఆమోదించారు. ఐరోపాకు చెందిన వాల్నెవా తయారు చేసిన ఈ వ్యాక్సిన్ను ఇక్స్ చిక్ పేరుతో విక్రయించబడుతుంది. 18 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వ్యక్తుల కోసం ఆమోదించబడిందని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ డి ఏ)తెలిపింది.