Home / తప్పక చదవాలి
తూర్పు ఇరాక్లోని దియాలా ప్రావిన్స్లో గుర్తుతెలియని ముష్కరులు బాంబులతో దాడి చేయడంతో కనీసం 11 మంది మరణించినట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. దాడికి బాధ్యులమని ఏ గ్రూపు వెంటనే ప్రకటించలేదు.
శుక్రవారం బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిన నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (ఐఎండి) దక్షిణాది రాష్ట్రాలైన తమిళనాడు, ఆంధ్రప్రదేశ్లకు ‘ఆరెంజ్’ అలర్ట్ ప్రకటించింది. వాతావరణ శాఖ ఆది, సోమవారాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
జనసేనకు యువతే పెద్ద బలమని పవన్ కళ్యాణ్ అన్నారు. పొరుగు రాష్ట్రాల యువత కూడా మనకు మద్దతు ఇస్తున్నారు. యువత ఆదరణ చూసే తెలంగాణలో 8 చోట్ల పోటీ చేశామని తెలిపారు. శుక్రవారం మంగళగిరిలో జనసేన విస్తృతస్దాయి సమావేశంలో పవన్ ప్రసంగించారు.
తెలంగాణాలో ఎన్నికల ఎగ్జిట్ పోల్స్పై కాపు సంక్షేమసేన అధ్యక్షుడు హరి రామజోగయ్య స్పందించారు. వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని చెబుతున్నాయని అన్నారు. తెలంగాణ ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ దూకుడుగా ఉందని తెలిపారు. తెలంగాణలో కేసీఆర్కు పట్టే గతే ఆంధ్రప్రదేశ్లో జగన్కు పట్టబోతుందని జోగయ్య జోస్యం చెప్పారు.
సుప్రీంకోర్టులో కృష్ణా జలాల వివాదం కేసు విచారణ జనవరి 12కి వాయిదా పడింది. ఏపీ, తెలంగాణ మధ్య కృష్ణా జలాలను పునః పంపిణీ చేయాలని ఇటీవల కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కృష్ణా ట్రిబ్యునల్కు నూతన విధివిధానాలు ఇవ్వడాన్ని ఏపీ ప్రభుత్వం సవాల్ చేసింది.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ( సీబీఎస్ఈ ) 10వ తరగతి మరియు 12వ తరగతి బోర్డు పరీక్షల మూల్యాంకన పద్ధతిలో మార్పులను ప్రకటించింది. సీబీఎస్ఈ ఇకపై విద్యార్థులకు డివిజన్లు, డిస్టింకన్లు ప్రదానం చేయదు, బదులుగా వ్యక్తిగత సబ్జెక్ట్ పనితీరుపై దృష్టి పెడుతుంది. సీబీఎస్ఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సన్యామ్ భరద్వాజ్ అధికారిక విడుదల ద్వారా ఈ నిర్ణయాన్ని తెలియజేశారు.
బెంగళూరులోని సుమారు 60 స్కూళ్లకు శుక్రవారం గుర్తు తెలియని ఈ మెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు రావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు మరియు పాఠశాల అధికారులలో భయాందోళనలు నెలకొన్నాయి.బసవేశ్వర్ నగర్లోని నేపెల్ మరియు విద్యాశిల్ప సహా ఏడు పాఠశాలలను లక్ష్యంగా చేసుకుని మొదటి బెదిరింపులు వచ్చాయి.
నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. విభజన చట్టం ప్రకారం తమకు రావాల్సిన వాటా నీటినే తీసుకున్నామని వివరించారు. తమవి కాని ఒక్క నీటి బొట్టునైనా తీసుకునే ప్రసక్తే లేదన్నారు. సాగర్ లో 13వ గేట్ వరకూ ఏపీకి చెందిన భూభాగమని.. మా ప్రాంతాన్ని మేము తీసుకున్నామని తెలిపారు.
నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఉద్రిక్తత కొనసాగుతోంది. డ్యాంపై ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరించాయి. డ్యామ్ 13వ గేటు వద్ద ఏపీ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించేందుకు తెలంగాణ పోలీసులు జేసిబిలను సిద్దం చేశారు. ఇరు రాష్ట్రాల పోలీస్ బలగాలు మోహరింపుతో డ్యామ్ పై ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది.
తెలంగాణలో 119 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో గురువారం సాయంత్రం 7 గంటల వరకు 64.14 శాతం పోలింగ్ నమోదైనట్లు భారత ఎన్నికల సంఘం వెల్లడించింది.అత్యధికంగా జనగాంలో 83.34 శాతం, నర్సంపేటలో 83 శాతం, నక్రేకల్లో 82.34 శాతం, భోంగిర్లో 81 శాతం, పాలకుర్తిలో 81 శాతం, జహీరాబాద్లో 79.8 శాతం, నర్సాపూర్ (78.89 శాతం), డోర్నకల్ (79.32 శాతం), వైరా (79.20 శాతం) పోలింగ్ నమోదయింది.