Home / తప్పక చదవాలి
: జూలైలో తన ఫేస్బుక్ స్నేహితుడిని పెళ్లి చేసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన రాజస్థాన్కు చెందిన అంజు రాఫెల్ అనే 34 ఏళ్ల మహిళ బుధవారం భారత్కు తిరిగి వచ్చింది.నేను సంతోషంగా ఉన్నాను. నాకు వేరే ఆలోచనలు లేవు అని అంజు తిరిగి వచ్చిన తర్వాత విలేకరులతో అన్నారు.
మధ్యప్రధేశ్, ఛత్తీస్గఢ్, మిజోరం,రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. వీటిలో ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ తిరిగి అధికారం నిలబెట్టుకునే పరిస్దితి కనపడుతోంది. మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్, బీజేపీల మధ్య గట్టి పోటీ ఉండగా రాజస్దాన్ లో బీజేపీకి మెజారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ నేపధ్యంలో ఇక్కడ ఫలితాలపై పలు సంస్దలు ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసాయి.అయితే మెజారిటీ సర్వేలు కాంగ్రెస్ కు ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని అంచనాలు వెలువరించాయి. వివిధ సంస్దలు విడుదల చేసిన ఎగ్జిట్ పోల్స్ ఈ విధంగా ఉన్నాయి.
కజకిస్తాన్లోని అతిపెద్ద నగరం అల్మాటీలోని హాస్టల్లో గురువారం జరిగిన అగ్నిప్రమాదంలో 13 మంది మరణించినట్లు నగరంలోని అత్యవసర విభాగం ఒక ప్రకటనలోతెలిపింది.మృతుల్లో తొమ్మిది మంది కజకిస్థాన్ కు చెందిన వారు కాగా , ఇద్దరు వ్యక్తులు రష్యా, ఇద్దరు ఉజ్బెకిస్థాన్కు చెందిన వారని అల్మాటీ పోలీసు విభాగం తెలిపింది.
రూ.250 కోట్ల మనీలాండరింగ్ కేసుకు సంబంధించి జమ్మూ కాశ్మీర్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం ఆరు చోట్ల సోదాలు నిర్వహించింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, జమ్మూ కాశ్మీర్ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ మాజీ ఛైర్మన్కు చెందిన ప్రాంగణంలో సోదాలు జరిగాయి. ఈ కేసు జమ్మూకశ్మీర్ బ్యాంకుకు సంబంధించినదని అధికారులు గతంలో పేర్కొన్నారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం నాడు 'నమో డ్రోన్ దీదీ' కార్యక్రమాన్ని ప్రారంభించి దేశవ్యాప్తంగా చేపట్టిన విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ప్రధాన పథకాలను సద్వినియోగం చేసుకోవలన్నారు. ఈ పథకాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరతాయని తెలిపారు.
గుజరాత్లోని సూరత్ లో రసాయన కర్మాగారంలో జరిగిన పేలుడు జరిగి ఏడుగురు కార్మికులు మరణించగా 25 మంది గాయపడ్డారు. ఏడుగురు కార్మికుల మృతదేహాలను గురువారం తెల్లవారుజామున తయారీ కేంద్రం ఆవరణ నుండి స్వాధీనం చేసుకున్నారు, గాయపడిన 25 మంది కార్మికులు ప్రస్తుతం వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
యునైటెడ్ స్టేట్స్ మాజీ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మరియు నోబెల్ శాంతి బహుమతి గ్రహీత అయిన హెన్రీ కిస్సింజర్ బుధవారం 100 సంవత్సరాల వయస్సులో మరణించారు.కిస్సింజర్ కనెక్టికట్లోని తన ఇంట్లో మరణించారని కిస్సింజర్ అసోసియేట్స్ తెలిపింది.
నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సాగర్ రైట్ కెనాల్ కు నీటిని విడుదల చేయడం కోసం ఏపీ పోలీసులు రావడంతో వివాదం చెలరేగింది. దాంతో ప్రాజెక్ట్ వద్ద విద్యుత్ సరాఫరాను అధికారులు నిలిపివేశారు. ఇక ఏపీ పోలీసులు డ్యామ్ గేట్లు ధ్వంసం చేసి ఎస్పీఎఫ్ పోలీసులపై దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. ప్రాజెక్టు సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు.
అమెరికాకు చెందిన ఓ సైనిక విమానం జపాన్ సముద్రంలో కుప్పకూలింది. యకుషిమా దీవి సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఆ సమయంలో విమానంలో ఆరుగురు సైనిక సిబ్బంది ఉన్నారు. ఈ ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో స్పృహతప్పి కనిపించిన ఒక వ్యక్తిని జపాన్ కోస్ట్గార్డు సిబ్బంది హుటాహుటిన యకుషిమాలోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతిచెందాడు.