Home / తెలంగాణ
ఆపరేషన్ ఆకర్ష్ ప్రలోభాల డీల్ వ్యవహారంలో గంటలు గడిచే కొద్ది పలు కీలక పరిణామాలు చోటుచేసుకొంటున్నాయి. తెరాస ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారంలో పోలీసుల ఎఎఫ్ఐఆర్ పై భాజపా న్యాయస్థానంలో పిటిషన్ కూడా దాఖలు చేసింది.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ధరణిని రద్దు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ధరణి పోర్టల్ రైతులకు గుదిబండగా మారిందని రైతు సంఘాల నేతలు రాహుల్ గాంధీ దృష్టికి తెచ్చారు.
దక్షిణ రాష్ట్రాల్లోని ప్రసిద్ధి నగరాల్లో ఒకటైన హైదరాబాదు నగరంలో నిషేధిత ప్లాస్టిక్ ను కట్టడి చేసేందులో ప్రభుత్వం విఫలం చెందింది. దీంతో భాగ్యనగరంలో ప్లాస్టిక్ భూతం, పర్యావరణాన్ని శరవేగంగా కబలిస్తుంది.
మునుగోడు ఉప ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసిన మొయినాబాద్ ఫామ్ హౌస్ ఎపిసోడ్ లో కీలక మలుపు చోటుచేసుకొనింది. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంపై భాజపా తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.
మునుగోడులో టీఆర్ఎస్ ఓడిపోతే రాజీనామా చేస్తానని బోధన్ ఎమ్మెల్యే షకీల్ సంచలన ప్రకటన చేశారు.
మొయినాబాద్ ఫాం హౌస్ కేంద్రంగా సాగిన తెరాస ఎమ్మెల్యేల ప్రలోభాల డీల్ ఘటనలో సీఎం కేసిఆర్ పై కేసు నమోదు చేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ తో ఎమ్మెల్యేల కొనుగోలు స్కాంను బయటపెట్టాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
మెయినాబాద్ ఫామ్ హౌస్ లో పోలీసులకు రెడ్ హ్యాండడ్ గా పట్టుబడిన తెరాస శాసనసభ్యుల ఆకర్ష్ ఘటన పై న్యాయస్ధానాన్ని ఆశ్రయించనున్నట్లు భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.
మునుగోడు ఉప ఎన్నికల వేళ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీకి చెందిన మధ్యవర్తులు కొనుగోలు చేస్తున్నారంటూ తెలంగాణ పోలీసులు ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో చలికాలం ప్రారంభమయ్యింది. శీతాకాలం వస్తూవస్తూనే ప్రజలను భయపెడుతోంది. గత ఏడాదితో పోల్చితే ప్రస్తుతం రాత్రి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. అప్పుడే పలు ప్రాంతాల్లో ఉదయం పూట పొగమంచు కురుస్తుంది.
తెలంగాణ మునుగోడు ఉపఎన్నికల వేళ అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం తీవ్ర కలకలకం రేపుతోంది. ఇకపోతే ఈ వ్యవహారం మరియు భాజపాపై వస్తున్న ఆరోపణలను భాజపా నేత బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. అధికార టీఆర్ఎస్పై స్ట్రాంగ్ కౌంటర్లు వేశారు.