Home / తెలంగాణ
ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ క్రమంలో ప్రగతిభవన్ లో సీఎం కేసిఆర్ కు కలిసిన ప్రభాకర్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన కేసిఆర్ కు ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ, తెలంగాణ సీఎం కేసీఆర్ లు కలిసి పనిచేస్తున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణలో భారత్ జోడోయాత్ర ముగింపు సందర్బంగా కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం మెనూర్ వద్ద జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ ఎలాంటి రైతు వ్యతిరేక చట్టాలు బిల్లులు ప్రవేశపెట్టినా టిఆర్ఎస్ మద్దతు ఇస్తోందన్నారు.
వ్రతం చెడ్డా ఫలితం దక్కని వైనంగా మారింది కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరిస్థితి.
తెలంగాణలో ప్రభుత్వానికి-గవర్నర్ కు మద్య దూరం రోజు రోజుకు పెరిగిపోతోంది. దీంతో ప్రజా జీవితంతో ముడిపడిన కీలక బిల్లులు రాజ్ భవన్ కార్యాలయంలో టేబుల్ కే పరిమితమైనాయి. ఈ క్రమంలో గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ ఏకంగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డికి లేఖ రాశారు.
తెలంగాణ కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరు మార్పుపై ఆ పార్టీ బహిరంగ ప్రకటన చేసింది. పార్టీ పేరును "భారత్ రాష్ట్ర సమితి" గా మారుస్తున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది.
మునుగోడు ఉపఎన్నికలో భాజపా నైతికంగా విజయం సాధించిందని, అయితే ప్రలోభాలు, బెదిరింపులతో ఓటమిని చూడాల్సి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.
ఓ కేసు విషయంలో సర్వోన్నత న్యాయస్థానం ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలపై సీరియస్ అయింది. మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దంటూ ధర్మాసం తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు చురకలంటించింది.
తాజాగా జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో కొంత ట్విస్ట్ చోటుచేసుకొనింది. ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ను బాగా కుంగతీసింది. గుడ్డిలో మెల్లన్నట్లుగా హుజూరాబాద్ ఉప ఎన్నికతో పోలిస్తే మునుగోడు ఉప ఎన్నికలో ఆ పార్టీకి ఓటు శాతం పెరిగింది.
హైకోర్టు ఉత్తర్వులను సైతం పెడచెవిన పెడుతున్నారు. పోలీసులు దాడులు చేస్తున్నా అనుకొన్నది వారు చేసేస్తున్నారు. దీంతో రెండు పబ్బుల పై హైదరాబాదు పోలీసులు కేసులు నమోదు చేశారు.