Home / ప్రాంతీయం
లావణ్య డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. షార్ట్ ఫిల్మ్లో నటించే లావణ్య మత్తుకు బానిస అయి చివరికి పోలీసులకు పట్టుబడింది. ఏపీలోని విజయవాడకు చెందిన మన్నేపల్లి లావణ్య చదువుకోసం హైదరాబాద్ వచ్చింది. గండిపేట మండలం కోకాపేటలో సోదరుడితో కలిసి నివాసం ఉంటోంది.
ఏపీకి చెందిన ఓ మహిళ ఇటీవల ఢిల్లీలోని హోటల్లో బస చేసి బిల్లు కట్టే సమయంలో మోసం చేయటంతో పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను విచారించగా ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె బ్యాంకు ఖాతాలో కేవలం 41 రూపాయలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ఢిల్లీలోని ఏరోసిటీలో ఉన్న పుల్మాన్ హోటల్లో ఝాన్సీరాణి గత డిసెంబర్లో 15 రోజులు ఉండడానికి గదిని బుక్చేశారు.
తెల్లాపూర్లో దివంగత విప్లవ గాయకుడు గద్దర్ విగ్రహ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ హైదరాబాద్ మున్సిపల్ డెవలప్మెంట్ అథారిటీ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.విగ్రహానికి అవసరమైన భూమిని మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారిక ప్రకటనలో తెలియజేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సత్యవేడు ఎమ్మల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం జాతీయపార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో భేటీ అయ్యారు. ఆయనకు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు నుంచి పోటీ చేయడానికి టికెట్ దక్కలేదు. దీనికి ప్రతిగా తిరుపతి నుంచి ఎంపీగా పోటీచేయమని చెప్పడంతో ఆయన షాక్ అయ్యారు.
తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీఖాన్ ల ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు వీరిచేత ప్రమాణస్వీకారం చేయించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సమరశంఖాన్ని పూరించింది. ఇందులో భాగంగా శనివారం భీమిలి నియోజక వర్గం సంగివలస సమీపంలో భారీ బహిరంగ సభ నిర్వహించింది. సీఎం జగన్ ఈ సభకు హాజరై క్యాడర్ లో జోష్ నింపే ప్రయత్నం చేసారు. రాబోయే ఎన్నికల యుద్దంలో ప్రతిపక్షాలు ఎన్ని వచ్చినా తాను సిద్దంగా ఉన్నానంటూ చెప్పారు. నేను సిద్దం మీరు సిద్దమా అంటూ కార్యకర్తలను ప్రశ్నించారు.
నెల్లూరు జిల్లాలోని నారాయణ గ్రూప్ విద్యార్థుల కుటుంబ సభ్యుల డేటాను సేకరిస్తోందని ని ఫిర్యాదు చేస్తూ వైఎస్సార్సీపీ ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేసింది.వివిధ పాఠశాలలు, జూనియర్ కళాశాలలు వృత్తిపరమైన కళాశాలలతో కూడిన నారాయణ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్లోని విద్యా రంగంలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నాయి. వారి విద్యా సంస్థల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల కుటుంబ సభ్యుల నుండి వ్యక్తిగత డేటా సేకరణలో నిమగ్నమై ఉన్నాయని తెలిపింది.
సోమవారం జరిగిన టీటీడీ పాలకమండలి సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో 5 కోట్ల 141 లక్షల అంచనాతో 2024-25 టీటీడీ వార్షిక బడ్జెట్ కి ఆమోదం తెలిపింది. పాలక మండలి నిర్ణయాలను చైర్మన్ కరుణాకర్ రెడ్డి వివరించారు.
: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ కుంభకోణం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. జస్టిస్లు సంజీవ్ ఖన్నా, దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం నాయుడుకు ఉపశమనం కల్పిస్తూ జనవరి 10న హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన పిటిషన్ను తోసిపుచ్చింది.
: టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేష్తో పాటు హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేష్ బాబు సహా అతని కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. నందకుమార్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఫిర్యాదును కోర్టు విచారించింది.