Home / ప్రాంతీయం
బీఆర్ఎస్, కేసీఆర్పై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో 15 స్థానాలలో గెలుపొందుతామని ధీమా వ్యక్తం చేశారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ రెండు లేదా మూడు సీట్లు గెలుచుకోవచ్చని జోస్యం చెప్పారు. కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేసినా ఉమ్మడి నల్గొండ జిల్లాలో డిపాజిట్ కూడా రాదన్నారు.మెదక్లో బీఆర్ఎస్ మూడో స్థానంలో నిలుస్తుందన్నారు. బీఆర్ఎస్ ఒక్క సీటూ గెలవదన్నారు.
రేవంత్ రెడ్డి మెదక్ లో తప్పుడు స్క్రిప్ట్ చదివారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. మెదక్ అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన నిధుల నివేదికను రేవంత్ రెడ్డికి కొరియర్ పంపించానని తెలిపారు. మెదక్ నివేదికే హరీష్ రావుకు, రేవంత్ రెడ్డికి సమాధానం చెబుతోందని చెప్పారు. మతకల్లోలాలు చేయడం బీజేపీ సిద్దాంతం కాదని.. కాంగ్రెస్ మేనిఫెస్టో వెనుకున్నది, మావోయిస్టులు, అర్బన్ నక్సలైట్లు, సోకాల్డ్ వాదులని విమర్శించారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్డీయే కూటమి అఖండ విజయం సాధించబోతోందని ధీమా వ్యక్తం చేశారు. మీడియాకు అండగా ఉండి వారి కష్టాల్లో పాలుపంచుకుంటామని పవన్ కళ్యాణ్ అన్నారు. పవన్ వెంట జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు, మాజీ ఎమ్మెల్యే వర్మ ఉన్నారు.
సీఎం జగన్ రాష్ట్రాన్ని పూర్తిగా విధ్వంసం చేశారని, కేసుల పేరుతో టీడీపీ నేతలను వేధిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాకినాడ జిల్లా జగ్గంపేటలో ప్రజాగళం బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీడీపీ చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యం నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.
రేపు హైదరాబాద్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా వైన్స్ బంద్ చేయాలని హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి బుధవారం సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఎవరు నిబంధనలు ఉల్లంఘించినా.. కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడువల చేసారు
ఏపీలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేష్కుమార్ ఫలితాలను విడుదల చేశారు.రాష్ట్రవ్యాప్తంగా 3వేల7వందల 43 పరీక్ష కేంద్రాల్లో మార్చి 18 నుంచి 30వ తేదీ వరకు పరీక్షలు జరిగాయి. ఇందులో మొత్తం 6.23 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవగా.. 86.69 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు
హైదరాబాద్ పోలీసు కమీషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. పంజాగుట్ట పోలీస్ స్టేషన్లోని మొత్తం సిబ్బందిని మార్చివేసారు. . ఇన్ స్పెక్టర్ నుంచి హోంగార్డు వరకు మొత్తం 85 మంది సిబ్బందిని హైదరాబాద్ బదిలీ చేశారు. మాజీ ప్రభుత్వ పెద్దలకు సమాచారం ఇస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు ఏపీ కాంగ్రెస్ ఇన్ చార్జి మాణికం ఠాగూర్ పరువు నష్టం దావా నోటీసులు పంపారు. 7 రోజుల్లో సమాధానం ఇవ్వకుంటే కోర్టుకు వెళ్తామని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదన్నారు. పీసీసీ చీఫ్గా రేవంత్ రెడ్డి ఎంపిక విషయంలో మాణికం ఠాగూర్పై బీఆర్ఎస్ నేతలు అవినీతి ఆరోపణలు చేశారు. దీంతో ఆయన పరువు నష్టం నోటీసులు పంపించారు.
మేడిపల్లి పోలీస్ స్టేషన్ ముందు హైదరాబాద్ కమిషనరేట్ కానిస్టేబుల్ నాగమణి ఆందోళన చేపట్టారు. సివిల్ తగాదాల్లో తలదూర్చుతున్న మేడిపల్లి ఎస్సై శివకుమార్ తమ ఇంటిని కబ్జా చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏకపక్షంగా వ్యవహరిస్తూ కబ్జాదారులకు సహకరిస్తున్న ఎస్సై శివకుమార్ పై కనీసం దర్యాప్తు చేయకుండా కేసులు నమోదు చేస్తున్నారంటూ ఆందోళన చేశారు.
హైదరాబాద్ లో సోషల్ మీడియా సంచలనం గా మారిన కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్ పై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. మంగళవారం ఆమె దుకాణాన్ని మూసివేయించిన పోలీసులు వేరే చోటకు మార్చాలని ఆదేశించిన విషయం తెలిపింది. అయితే తాజాగా ప్రభుత్వం అదే ప్రాంతంలో ఫుడ్ స్టాల్ కొనసాగించుకోవచ్చని తెలిపింది.