Home / ప్రాంతీయం
భారీ వర్షాలు కురుస్తున్న నేపధ్యంలో అనంతపురం, కర్నూలు జిల్లాల గుండా ప్రవహించే వేదవతి నదిగత వందేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా పొంగి పొర్లుతోంది. ఈ నది పై కర్ణాటక ప్రాంతంలో నిర్మించిన ప్రాజెక్టుల కారణంగా దశాబ్దాలుగా నీరు అడుగంటింది.
రాష్ట్రానికి మంచి చేయాలన్నదే తన అభిలాష అని గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ అన్నారు. తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టి మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్ భవన్ లో నేడు ఆమె ప్రసంగించారు.
బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సినీనటి దివ్య వాణి కలిశారు. హైదరాబాద్ శామీర్ పేటలో ఉన్న ఈటల నివాసానికి ఆమె వెళ్లారు. ఈరోజు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కలవడం పట్ల ఆసక్తి నెలకొంది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గుర్తుందా? ఆ సినిమాలో హాస్పిటల్ దోపిడీని బయటపెట్టేందుకు మెగాస్టార్ చిరంజీవి ప్లాన్ చేస్తారు. చనిపోయిన వ్యక్తి చావుబతుకుల్లో ఉన్నాడంటూ ట్రీట్మెంట్ చేసి బతికించాలని ఓ శవాన్ని డాక్టర్ల వద్దకు చిరంజీవి తీసుకెళ్తారు.
రుణం, రుణం ఈ మాటలు సామాన్యుడి దగ్గర నుండి బడా బడా పారిశ్రామిక వేత్తల వరకు నిత్యం వారి వారి లావాదేవీలకు అవసరమైన మాటలే. అవసరాన్ని క్యాష్ చేసుకొనేందుకు మార్కెట్టులో రుణయాప్ లు వీధికొకటి వెలవడం. ఫైనాన్స్ కోసం ఎదురుచేసే వారికి అభయహస్తం మా సంస్ధ అంటూ నమ్మించడం. ఇది అందరికి తెలిసిందే.
హుస్సేన్ సాగర్ లో గణేష్ నిమజ్జనం పై వివాదం తొలగిపోయింది. రేపటి నిమజ్జనాలకు ట్యాంక్ బండ్ పై జిహెచ్ఎంసి అధికారులు భారీగా ఏర్పాట్లు చేశారు. నిమజ్జనాల కోసం ఏకంగా 15 క్రేన్లు ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ మార్గంలో 9, పీవీ మార్గ్ లో 8 క్రేన్లు ఏర్పాటు చేస్తున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో విషాదం చోటు చేసుకుంది. లోన్ యాప్ వేధింపులు భరించలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. పట్టణంలోని ఆనంద్ నగర్ కు చెందిన దుర్గారావు లక్ష్మీ దంపతులు రుణ యాప్ ద్వారా 50వేలు రుణం తీసుకున్నారు.
రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిలేని వానలు కురుస్తున్నాయి. కాగా చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నాగార్జున సాగర్ ప్రాజెక్టులోకి వరద నీటి ఉద్ధృతి కొనసాగుతుంది. ఎగువ నుంచి వస్తోన్న వరదనీటి ప్రవాహాన్ని తాళలేక సాగర్ ఎడమ కాలువకు గండి పడింది.
ఐఐటీ హైదరాబాద్కు చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్థాన్లోని జోధ్పూర్కు చెందిన మెగా కపూర్. ఐఐటీలో బీటెక్ కెమికల్ ఇంజినీరింగ్ చదువుతున్నాడు. గతకొన్ని రోజులుగా సంగారెడ్డిలోని ఓ లాడ్జిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో బుధవారం లాడ్జి పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
హైదరాబాద్లో2019తో పోల్చితే 2021లో రోడ్డు ప్రమాదాల కారణంగా పాదచారుల మరణాలు 276% పెరిగాయి. ఇది దేశంలోని 53 నగరాల్లో 2019లో 22 నుండి ఏడవ స్థానానికి చేరుకుంది. అయితే పాదచారుల గాయాల పరంగా (590), హైదరాబాద్ దేశంలోనే మొదటి స్థానంలో ఉంది.