Home / ప్రాంతీయం
మూడు రాజధానుల పేరుతో వైకాపా ప్రభుత్వం మూడింతల అవినీతికి పాల్పడిందని బీజేపి నేత సునీల్ ధియోధర్ విమర్శించారు. నాడు ఒక్క రాజధాని పేరుతో అవినీతి తెదేపా చేపట్టిందని ఆయన పేర్కొన్నారు
ఏపీలో పెద్ద దుమారం లేపిన వైఎస్ వివేకా హత్య కేసు విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలంటూ ఆయన కుమార్తె సునీత రెడ్డి సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సర్వోత్తమ న్యాయస్ధానం విచారణ చేపట్టింది.
సర్పంచ్ గా గెలిచిన తర్వాత శాసనసభ్యుల గురించి మాట్లాడాలని నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ పై మంత్రి రోజా ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్ వైకాపా పై పలు ఆరోపణలు గుప్పించిన నేపధ్యంలో రోజా ఆయనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ప్రవర్తన సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను చర్చించకుండా విలువైన సభా సమయాన్ని వృధా చేస్తున్నారని మండిపడ్డారు. బయట మీడియా ముందు డ్రామాలు ఒక్కటే తెదేపాకు తెలుసునని మంత్రి కాకాని ఎద్దేవా చేశారు.
బుడిబుడి అడుగుల ఓ ఐదేళ్ల చిన్నారి ఆడుకుంటూ కూల్ డ్రింక్ అనుకొని పురుగుల మందు తాగేసింది. ఆసుపత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందింది. ఈ హృదయ విధారక ఘటన కొమురంభీం జిల్లా భీంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
సీఎం క్యాన్వాయా మజాకా. ఏ మార్గంలోనైనా సీఎం కాన్వాయ్ వస్తుంటే ఆ మార్గంలో పాదచారులకు, వాహనదారులకు తిప్పలు ఇక చెప్పనక్కర్లేదు. హైదరాబాదులోని ప్రధాన రహదారుల్లో అయితే ఇక ప్రజల పడే నరకం అంతా ఇంత కాదు. కాన్వాయ్ వెళ్లే సమయంలో రోడ్డు మార్గంలో వెళ్లిన కారణంగా ఓ మహిళ పై కేసు నమోదైన ఘటన తెలంగాణ విమోచన దినం నాడు చోటుచేసుకొనింది.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు.
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం ''ఛలో అసెంబ్లీ'' పేరిట వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్తో తమ కుటుంబానికి ప్రత్యక్షంగా ఎలాంటి సంబంధం లేదని వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తమ తండ్రి హయాం నుంచే తాము లిక్కర్ వ్యాపారం చేస్తున్నామని చెప్పారు. కుట్రపూరితంగా తమపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
ఏపీ అసెంబ్లీలో సోమవారం పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపు పై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది.