Home / ప్రాంతీయం
పల్నాడు జిల్లా వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసారు. టీడీపీ నేతలను నల్లుల్లా నలిపేస్తానని హెచ్చరించారు. వినుకొండలో గురువారం వాణిజ్య సముదాయం భూమిపూజ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ఆదిమూలపు సురేష్ హాజరయ్యారు.
రాష్ట్రంలో రైతు ఆత్మహత్యలు చూస్తుంటే ఆందోళన కలుగుతోందని జనసేన పొలిటికల్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారువిభజించి పాలించు అనే సూత్రంతో వైసీపీ ముందుకు వెళుతోందని విమర్శించారు. రైతులు సుభిక్షంగా ఉన్నప్పుడే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందని ఆయన అన్నారు.
వ్యవస్దలను తన అవసరానికి వాడుకునే వ్యక్తి. రాజకీయాలకోసం ఎంతకైనా దిగజారే వ్యక్తి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పై మాజీ మంత్రి పేర్ని నాని విరుచుకు పడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ నిత్యం అసత్యం ప్రచారం చేయడమే చంద్రబాబు పని
బీజేపీ రాష్ట్ర అధినాయకత్వం పై తాను అసంతృప్తిగా ఉన్నట్టు బీజేపీ సీనియర్ నేత విజయశాంతి అన్నారు. పార్టీలో తనకు పాత్ర లేకుండా చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. జాతీయ నాయకత్వంతో తనకు ఎలాంటి సమస్య లేదని,
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోపై గురువారం ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సునీల్ కుమార్ మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. వీడియో కాల్ ఇద్దరి మధ్య జరిగిందని, మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియో అదని చెప్పారు. మూడో వ్యక్తి షూట్ చేసిన వీడియోను.. ల్యాబ్కి పంపి రిపోర్టు తీసుకున్నారని, ప్రైవేట్ ల్యాబ్ ఇచ్చే నివేదికకు విలువ ఉండదన్నారు.
సీఎం కేసీఆర్.. తెలంగాణాలో ఇన్నాళ్లూ తిరుగులేని నాయకుడిగా ఉన్నారు. అయితే.. గంత కాలంగా రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. బీజేపీ క్రమంగా బలపడుతుండటంతో టీఆర్ఎస్లో సహజంగానే కలవరం మొదలైనట్లు తెలుస్తోంది.
కోమటిరెడ్డి బ్రదర్స్ తెలంగాణలో ఒక్కసారిగా న్యూస్మేకర్స్గా నిలిచారు. రాజగోపాల్రెడ్డి ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మునుగోడులో ఆయన నుంచి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నారు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడ్డాక రాజకీయంగా అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. నిజామాబాద్ ఎంపీగా గెలిచినా కల్వకుంట్ల కవిత పసుపు రైతులను పట్టించుకోలేదని విమర్శలు వినిపించాయి.పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానన్న హామీ ఇచ్చి 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిచారు ధర్మపురి అరవింద్. పసుపు రైతులకు స్పైస్ బోర్డు ఏర్పాటు చేసిన అరవింద్ను రాజకీయంగా ఎదుర్కోలేక టీఆర్ఎస్ సరికొత్త వ్యూహానికి తెరతీసింది. రైతులను ఎంపీపైకి ఉసిగొల్పడంతో దాడుల వరకు వెళ్లింది రాజకీయం.
ఖమ్మంలో సంచలనం సృష్టించిన టిఆర్ఎస్ నేత తమ్మినేని కృష్ణయ్య హత్య కేసులో పోలీసులు ఆరుగురు నిందితులను ఏపీలో అరెస్ట్ చేశారు. తమ్మినేని కృష్ణయ్య కుమారుడు నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు తమ్మినేని కోటేశ్వరరావుతో పాటుగా, పోలీసులు ఎనిమిది మందిని ఈ కేసుల
తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్షా పర్యటన ఖరారైంది. ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు మునుగోడులో జరగనున్న భారీ బహిరంగ సభకు అమిత్షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్చుగ్ తెలిపారు.