Home / ప్రాంతీయం
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాయిదా పడ్డాయి. అసెంబ్లీ దివంగత కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్నకు నివాళులర్పించింది. అనంతరం సభలో సీఎం కేసీఆర్ సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో శాసన సభ్యుడిగా, ఇతర అనేక హోదాల్లో పని చేశారని సీఎం కేసీఆర్ తెలిపారు.
యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ).. దేశ వ్యాప్తంగా 20 యూనివర్సిటీ లను ఫేక్ యూనివర్సిటీ లుగా గుర్తించింది. కాగా ఆయా విశ్వవిద్యాలయాలకు డిగ్రీలు ప్రధానం చేసే అధికారం లేదని ప్రకటించింది. ఆ యూనివర్సిటీలు జారీ చేసే డిగ్రీలతో ఉన్నత విద్యకు, ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం లేదని తేల్చేసింది.
సినీ నటి జయసుధ బుధవారం భారతీయ జనతాపార్టీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ ఇంచార్జ్ తరుణ్ ఛుగ్, రాష్ట్ర అద్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ సమక్షంలో ఆమె బీజేపీలో చేరారు. తెలంగాణ రాష్ట్ర ఇంచార్జీ తరుణ్ చుగ్ పార్టీ సభ్యత్వం అందించి కండువా కప్పి పార్టీలోకి స్వాగతం పలికారు
సంకల్పానికి మించిన ఆయుధం మరొకటి లేదని.. స్త్రీ అనుకుంటే సాధించలేనిది ఏది లేదని మరో మహిళ నిరూపించింది. రెక్కాడితే కానీ డొక్కాడని పరిస్థితిలో ఓవైపు కూలీ పనులు చేసుకుంటూనే భర్త ప్రోత్సాహంతో మరో వైపు చదువును కొనసాగించింది. అవిశ్రాంతంగా పేదరికంపై పోరాడి.. కృష్టి, పట్టుదలతో చివరికి తాను అనుకున్నది సాధించిన ఆ వీర వనిత పేరు.. సాకే భారతి ..
తన క్యారెక్టర్ పెట్టి అవమానించారంటూ జనసేనాని పవన్ కళ్యాణ్ తాజా సినిమా బ్రోపై మండిపడుతున్న ఏపీ మంత్రి అంబటి రాంబాబు కసితో రగిలిపోతున్నారు. బ్రో సినిమా ద్వారా టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు జనసేనాని పవన్ కళ్యాణ్కి ప్యాకేజి ఇచ్చారంటూ అంబటి ఆరోపిస్తున్నారు. బ్రో నిర్మాతకి అక్రమంగా డబ్బులు వచ్చాయని, ఆ నిర్మాత ద్వారా టిడిపి పవన్ కళ్యాణ్కి డబ్బులిచ్చిందని అంబటి చెబుతున్నారు.
ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్లోని జనసేన కేంద్ర కార్యాలయాన్ని మంగళగిరికి మార్చారు. అక్కడ పనిచేసే సిబ్బంది, ఇతర విభాగాలు, దస్త్రాలు, కంప్యూటర్లను కూడా మంగళగిరికి తరలించారు. పవన్కల్యాణ్ ఇకపై మంగళగిరిలోనే ఉంటారని పార్టీ వర్గాలు
రైల్వే సాంకేతిక విభాగంలో ఉద్యోగాల కోసం అన్ని అర్హతలు కలిగిన యువతకు నియామకాలు ఇవ్వకుండా పెండింగ్లో ఉంచడం దారుణమని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. సీసీఎఎ అర్హత సాధించిన వారు తెలుగు రాష్ట్రాల్లో 400మందిని పెండింగులో ఉంచారని తెలిపారు.
హైదరాబాద్ బాచుపల్లిలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదం అందరితో కంటతడి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు.. ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టడంతో ఆ వాహనంపై ఉన్న చిన్నారి కింద పడిపోగా.. ఆమెపై నుంచి బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఇందుకు
తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి ఇక నందిని నెయ్యిని వినియోగించరు. దీనితో 50 ఏళ్ల బంధానికి బ్రేక్ పడింది. తిరుమల లడ్డూల తయారీకి వాడే నెయ్యిని తక్కువ ధరకు అందించే మరో కంపెనీకి టీటీడీ టెండర్ ఖరారు చేసింది. దీనిపై కర్ణాటకలో రాజకీయ దుమారం రేగింది.
నువ్వు నాతో ఉన్నప్పుడు నాకెవరూ వద్దనిపిస్తోంది.. కానీ నువ్వు నాతో లేనప్పుడు నాకంటూ ఎవరూ లేరనిపిస్తోంది.. ఈ మాటలు ఎవరో భగ్న ప్రేమికుడు తన ప్రేయసి కోసం చేపప్దు అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్టే.. 16 ఏళ్ల తెలిసి తెలియని వయసులో ఓ విద్యార్ధి.. ఆకర్షణకి లోనయ్యి.. చివరికి తన ప్రాణాలనే తీసుకోవడం ఇప్పుడు