Home / ప్రాంతీయం
వైకాపా నేతలు, మంత్రులు సినీ నటుడు చిరంజీవిపై చేస్తున్న వ్యాఖ్యలపట్ల ఆయన సోదరుడు, జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ట్విట్లర్లో తీవ్రంగా స్పందించారు. శ్రమని పెట్టుబడిగా పెట్టి, పన్నుని ప్రభుత్వానికి అణా పైసలతో సహా కట్టి, వినోదాన్ని విజ్ఞానాన్ని జనానికి పంచిపెట్టి, 24 క్రాఫ్ట్లకి అన్నం పెడుతున్న ఏకైక పరిశ్రమ చిత్రపరిశ్రమని నాగబాబు గుర్తు చేశారు.. అయితే నిజం మాట్లాడిన వ్యక్తి మీద ఆంధ్రా మంత్రులు విషం కక్కుతున్నారని నాగబాబు విమర్శించారు.
భీమవరంలోని శ్రీసోమేశ్వర స్వామి ఆలయంలో అర్చకుడిపై వైసీపీ నాయకుడు దాడికి చేయడాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఖండించారు. ఆలయ సహాయ అర్చకుడు పండ్రంగి నాగేంద్ర పవన్ పై వైసీపీ నాయకుడైన ఆలయ బోర్డు ఛైర్మన్ భర్త యుగంధర్ చేసిన దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు.
దేవుడు నోరు ఇచ్చాడు.. అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే గా గెలిచారు.. మొత్తానికి ప్రజల టైమ్ బాగోలేక మంత్రి అయ్యారు.. అన్ని అలా జరిగిన ఏ రోజు కూడా తమ శాఖ ఏంటి.. ప్రజలకు, రాష్ట్రానికి ఏ విధంగా మన శాఖ నుంచి మంచి చేయాలి.. రాష్ట్రానికి మన శాఖ పరంగా అభివృద్ధి ఏ విధంగా తీసుకు రావాలి.. టూరిజంలో ఏపీని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. చేపట్టిన వారాహి యాత్ర దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే రెండు విడతలు విజయవంతం కాగా మూడో విడతను కూడా ప్రకటించింది. ఆగస్టు 10వ తేదీన విశాఖ సిటీ నుంచి మూడో విడత వారాహి విజయ యాత్ర ప్రారంభం కానుంది. అదే రోజు విశాఖపట్నంలో సభను నిర్వహించనున్నట్లు
సినిమా పరిశ్రమ పిచ్చుక లాంటిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా 200 రోజుల ఫంక్షన్ లో మెగాస్టార్ చేసిన వ్యాఖ్యలను ఆయన సమర్దించారు.చిరంజీవి వ్యాఖ్యలకు అర్థం వుంది. చిరంజీవి సామాన్య వ్యక్తి కాదని ఉండవల్లి అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య 200 రోజుల ఫంక్షన్ లో మాట్లాడుతూ.. ఏపీ సర్కారుపై పలు కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. పోలవరం, ప్రత్యేక హోదా, రోడ్ల నిర్మాణం, రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి సారించాలని.. పిచ్చుకపై బ్రహ్మాస్త్రంలా సినిమాలపై పడుతున్నారెందుకని ఆయన మాట్లాడారు.
ఏపీలో వాలంటీర్ల వ్యవహారం ఎంతటి చర్చనీయాంశంగా మారిందో ప్రతి ఒక్కరికీ తెలిసిందే. ఒక వైపు కొందరు వాలంటీర్ల నేరాలు, డేటా సేకరణ వంటి అంశాలు ఏపీలో కలకలం సృష్టిస్తుంటే.. మరోవైపు వాలంటీర్ల నేరాలు ఒక్కోటిగా బయటపడడం ప్రభుత్వానికి మింగుడు పడని అంశంలా తయారయ్యింది. కాగా ఇప్పటికే బంగారం కోసం
వరంగల్ జిల్లాలో నకిలీ పురుగు మందులు, గడ్డి మందుల తయారీ ముఠాని పోలీసులు అరెస్ట్ చేశారు. 13మంది సభ్యుల ముఠాలో నలుగురిని టాస్క్ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. మరికొందరు ముఠా సభ్యులు పరారీలో ఉన్నారు. అరెస్టైన వారినుంచి నాలుగు డిసిఎంల లోడ్ నకిలీ పురుగు మందులు, నకిలీ హాలోగ్రామ్ స్టిక్కర్లు, తయారీ సామగ్రిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ 57 లక్షల రూపాయలుంటుందని వరంగల్ సిపి రంగనాథ్ మీడియాకి చెప్పారు
ఏపీ ప్రభుత్వంపై వాల్తేరు వీరయ్యసినిమా 200 రోజుల వేడుకలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపట్ల గుడివాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వైసీపీ కొడాలి నాని ఘాటుగా స్పందించారు. తమ ప్రభుత్వానికి ఇచ్చే ఉచిత సలహాలు సినీ పరిశ్రమలో ఉన్న పకోడిగాళ్లకి కూడా చెబితే బాగుంటుందని చిరంజీవికి సూచించారు.
జగన్ మూర్ఖత్వం వల్లే పోలవరం డయాఫ్రం వాల్ దెబ్బతిన్నదని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా నేడు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు సందర్శించారు. పోలవరం వద్ద సెల్ఫీ తీసుకుని సీఎం జగన్ కు చాలెంజ్ విసిరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే పోలవరం గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు.