Last Updated:

Nara Lokesh: కుంభమేళలో మంత్రి నారా లోకేష్‌ దంపతులు – ఫోటో వైరల్‌

Nara Lokesh: కుంభమేళలో మంత్రి నారా లోకేష్‌ దంపతులు – ఫోటో వైరల్‌

Nara Lokesh Visit Kumbh Mela: ఏపీ మంత్రి నారా లోకేష్‌ ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో పర్యటించారు. కుటుంబ సమేతంగా కుంభమేళకు వెళ్లారు. భార్య బ్రహ్మణి, కుమారుడు దేవాన్ష్‌తో కలిసి కుంభమేళలో పుణ్యస్నానం ఆచరించారు. ఈ సందర్భంగా కుమారుడు, భార్యతో కలిసి దిగిన సెల్ఫీ ఫొటోను షేర్‌ చేశారు. ఈ ఫోటోని షేర్‌ చేస్తూ “నిజమైన ఆశీర్వాదం లభించింది” అంటూ క్యాప్షన్‌ ఇచ్చారు. కాగా ఈ మహా కుంభమేళకు దేశ నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు. కేవలం భారతీయులు మాత్రమే కాదు విదేశీయులు సైతం కుంభమేళకు వచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

ప్రతి రోజూ కోట్లలో ప్రజలు కుంభమేళకు తరలివస్తున్నారు. ఈ క్రమంలో కేవలం నిన్న (ఫిబ్రవరి 16) ఒక్క రోజే సాయంత్ర 6 గంటల వరకు 1.36 కోట్ల మంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్టు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. దీంతో నిన్నటి వరకు మొత్తం 52.83 కోట్ల మంది కుంభమేళలో పుణ్యస్నానాలు ఆచరించినట్టు తెలిపింది. ఇక ఈ కుంభమేళకు సామాన్య భక్తులతో పాటు ప్రముఖులు సైతం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి మోదీ ప్రయాగ్‌రాజ్‌ వచ్చారు. అలాగే భారత కుబేరుడు ముఖేష్‌ అంబానీ కుటుంబంతో వచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. ఇక సినీ ప్రముఖులు సైతం కుంభమేళలకు తరలివస్తున్నారు.