Last Updated:

Guppedantha Manasu: అక్టోబర్ 05 ఎపిసోడ్ లో జగతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu: అక్టోబర్ 05 ఎపిసోడ్ లో జగతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu: అక్టోబర్ 05  ఎపిసోడ్ లో జగతికి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన దేవయాని

Guppedantha Manasu: నేటి గుప్పెడంత ఏపిసోడ్ లో సీరియల్ ఎపిసోడులో ఈ సీను హైలెట్

రిషి చైర్‌లో కూర్చున్న వసుధార..ఈ విధంగా రిషీలా మాట్లాడుతూ ‘అటెండర్ వసుధారని పిలువు.. తనని గట్టిగా క్లాస్ పీకాలి..’అంటూ తన స్టైల్లో బిల్డప్ కొడుతుంది.మరోవైపు అక్కడే ఉన్న లవ్ సింబల్ని అందుకుని రిషీతో ఇలా మాట్లాడుతున్నట్టు చాక్లెట్ తీసి..తింటారా సార్.. ఇది కాకి ఎంగిలి కాదు సార్.. అంటూ చిలిపిగా మాట్లాడుతూ ఉంటుంది.వసుధార ఇమిటేటింగ్ అంతా రిషి ఫోన్‌లో వీడియో తీస్తూ చాటుగా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు.సరిగ్గా అప్పుడే రిషికి ఫోన్ రావడంతో .. ఆ సౌండ్‌కి వసు..ఒక్కసారిగా షాక్ అవుతుంది. వెంటనే..‘మళ్లీ కలుస్తాను సార్’అంటూ వసు చిలిపిగా నవ్వి…అక్కడ నుంచి పారిపోతుంది.

నాకు ఎప్పుడు ఏం చెయ్యాలో తెలుసులే మహేంద్ర

‘నాకు ఎప్పుడు ఏం చెయ్యాలో తెలుసులే మహేంద్ర..నేను చెయ్యాలి అనుకుంటే ఏ పనినైనా చేయగలను..కానీ తండ్రివి కదా..బాధ్యత నీకు అప్పగిస్తున్నా..నువ్వు ఆ పనిని చక్కగా పూర్తి పని చెయ్’ అంటూ పొగరుగా చెప్పి అక్కడ నుంచి వెళ్తుంది.ఆ మాటలకు మహేంద్ర తల పట్టుకుంటాడు.దేవయాని వెళ్తూ వెళ్తూ..జగతికి ఎదురుపడిన తనని కూడా మాటలతో గాయపరుస్తుంది.‘మహేంద్రతోనే సారీ చెప్పించుకున్నా…నేను.. ఏదైనా చేయగలను అని గుర్తుపెట్టుకో జగతీ’ అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.దాంతో జగతీ.. కంగారుగా మహేంద్ర దగ్గరకు వెళ్తుంది.మరోవైపు వసు, రిషీలు లొకేషన్లో సంతోషంగా గడుపుతూ ఉంటారు.తరువాత ఏమి జరగనుందో రేపటి ఎపిసోడులో తెలుసుకుందాం.

ఇదీ  చదవండి :GruhaLakshmi: అక్టోబర్ 05 ఎపిసోడులో నందును ఘోరంగా అవమానించారు !

ఇవి కూడా చదవండి: