Home / సినిమా వార్తలు
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన RRR చిత్రం దేశవిదేశాల్లో విమర్శకులను మెప్పించింది. గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ను అందుకుంది. తాజాగా అకాడమీ అతనిని తన జ్యూరీలో చేరమని ఆహ్వానించింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్లు, డిజైనర్ వేర్లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది
ప్రస్తుతం సోనాక్షి.. జహీర్ ఇక్బాల్ వివాహం గురించి బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి వివాహం ఆదివారం అంటే జూన్ 23 సాయంత్రం జరుగనుంది. అయితే పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జహీర్ తండ్రి ఇక్బాల్ రత్నాసి వివరణ ఇచ్చారు.
బాలీవుడ్లో మరో జంట ఒక్కటి కాబోతోంది. ఈ నెల 23న ముంబైలో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా.. జహీర్ ఇక్బాల్ను వివాహం చేసుకోబోతున్నారు. అప్పుడే సెలెబ్రేషన్స్ కూడా మొదలయ్యాయి.అయితే సోనాక్షికి జహీర్కు మధ్య రిలేషన్ షిప్ ఎప్పుడు మొదలైంది. మొదటిసారి వారు బహిరంగంగా ప్రజల ముందుకు ఎప్పుడొచ్చింది ఒక లుక్కేద్దాం.
శత్రుఘ్నసిన్హా కూతురు సోనాక్షి సిన్హా తన బాయ్ఫ్రెండ్ జహీర్ ఇక్బాల్లో ఈ నెల 23న పెళ్లి చేసుకోబోతున్నట్లు సోమవారం జాతీయ మీడియాతో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయం గురించి ఆయన తండ్రి బాలీవుడ్ నటుడు శత్రుఘ్నసిన్హా స్పందించారు.
బాలీవుడ్కు చెందిన మరో నటి ఆత్మహత్య చేసుకున్నారు. ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్లో కాజోల్తో కలిసి నటించిన నూర్ మలాబికా దాస్ కన్నుమూశారు.ముంబైలోని లోకండ్వాలా ఫ్లాట్లో తన గదిలోని సీలింగ్ ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు.
హీరోహీరోయిన్ల క్రేజ్ను బట్టి వాళ్లవాళ్ల ప్లేస్లు డిసైడ్ అవుతుంటాయి. ఐతే.. ఇవి సినిమా సినిమాకి.. మారిపోతుంటాయి. ఒక్కోసారి రోజుల గ్యాప్లో కూడా ప్లేస్లు ఛేంజ్ అవుతుంటాయి. నెలనెలా ఎవరెవరు టాప్ ప్లేస్లో ఉన్నారో ఆర్మాక్స్ మీడియా సంస్థ ఓటింగ్ నిర్వహించి లిస్ట్ రిలీజ్ చేస్తుంది.
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. నటి హేమకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. తెలుగు వ్యక్తులు డ్రగ్స్ తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. నటి హేమ, అషీరాయ్, వాసుకు డ్రగ్స్ పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది.
బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే ఇటీవల ముంబైలో ఓటు వేయడానికి భర్త రణవీర్సింగ్తో వెళ్లినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆమెపై ట్రోలింగ్ విపరీతంగా పెరిగిపోయాయి. సోషల్ మీడియా యూజర్లు ఆమెది ఫేక్ బేబీ బంప్ అంటూ కామెంట్లు చేయడం మొదలుపెట్టారు.