Ajith Kumar Joins in Hospital: ఫ్యాన్స్ అత్యుత్సాహం.. ఆస్పత్రిలో చేరిన హీరో అజిత్ – గాయాలకు చికిత్స

Ajith Kumar Hospitalised in Chennai Due to Leg Injury: తమిళ స్టార్ హీరో అజిత్ ఆస్పత్రిలో చేరారు. అభిమానుల చూపించిన అత్యాత్సుహం కారణంగా ఆయన కాలికి గాయపడినట్టు కోలీవుడ్ మీడియాల్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. కాగా అజిత్ ఇటీవల పద్మ భూషణ్ అవార్డు అందుకున్న సంగతి తెలిసిందే. న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో ఏప్రిల్ 28న పద్మ పురస్కారం ప్రదానొత్సవం జరిగింది.
కుటుంబసమేతంగా ఢిల్లీ ఈవెంట్ కి
ఈ కార్యక్రమానికి అజిత్ తన భార్య షాలిని, కూతరుకొడుకుతో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. సినీరంగానికి ఆయన అందించిన విశేష సేవలకు గానూ కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మ భూషణ్ అవార్డు ప్రకటించింది. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ అవార్డును అందుకున్నారు. అనంతరం కుటుంబంతో కలిసి నిన్న ఆయన చెన్నై చేరుకున్నారు. తమ అభిమాన హీరోకి పద్మ భూషణ్ రావడంతో అజిత్ అభిమానులంత ఆనందంలో మునిగితేలుతున్నారు.
ఎయిర్పోర్టులో గాయం..
పద్మ భూషణ్ తో చెన్నై చేరుకున్న ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఆయనను చూడగానే అత్యుత్సాహంతో అంత ఒక్కసారిగా ఆయనవైపు దూసుకురావడంతో అజిత్ కాలికి స్వల్ప గాయాలైనట్టు ఆయన టీం తెలిపింది. దీంతో వెంటనే ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వెళ్లారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, అజిత్ ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారు. దీంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉంటే ఆయన పద్మ భూషణ్ అందుకుంటున్న రోజే ఆయన మాజీ ప్రేయసి, నటి హీరో రాజగోపాల్ సంచలన పోస్ట్ పెట్టారు. పేరు ప్రస్తావించకుండానే ఓ హీరో తనని ప్రేమించిన మోసం చేశాడంటూ ఆరోపణలు చేసింది.
నటి హీరా సంచలన ఆరోపణలు
తను ప్రేమలోనే కాదు ఆరోగ్యం విషయంలోను తనకు అబద్ధం చెప్పి తన భావోద్వేగాలతో ఆడుకున్నాడని, అతడి వల్ల తాను ఎన్నో అవమానాలు, ఇబ్బందులు పడ్డానని గుర్తు చేసుకుంది. దీంతో హీరా అజిత్ని ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేసిందని కోలీవుడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కాగా అజిత్ చివరిగా గుడ్ బ్యాడ్ అగ్లీతో ప్రేక్షకులు ముందుకు వచ్చారు. త్రిష హీరోయిన్గా నటించిన ఈ సినిమా గతవారం విడుదలై సూపర్ హిట్ టాక్ను సొంతంగా చేసుకుంది. కలెక్షన్స్ పరంగా బాక్సాఫీసు వద్ద దుమ్ముదులిపింది. విడుదలైన ఐదు రోజుల్లోనే వందకోట్ల క్లబ్లో చేరిన ఈచిత్రం.. ఇప్పటి వరకు రూ. 250 పైగా కోట్ల గ్రాస్ చేసినట్టు ట్రేడ్ వర్గాల నుంచి సమాచారం.