Home /Author Guruvendhar Reddy
Sensational letter released by Maoist Party: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం చెల్పాక ఎన్కౌంటర్పై మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంచలన లేఖ విడుదల చేసింది. నమ్మక ద్రోహి పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకే ఏటూరు నాగారంలో తమ సహచరులు అత్యంత కిరాతకంగా చంపారని, పోలీసులకు అప్రూవర్గా మారిన ఇన్ఫార్మర్ ద్వారా భోజనంలో విషం ఇచ్చి స్పృహ కోల్పోయే లాగా చేశారని తెలిపింది. స్పృహా కోల్పోయిన కామ్రేడ్స్ను పట్టుకుని చిత్రహింసలు పెట్టి తెల్లవారుజామున 4 […]
Kakinada Port Issue: ఆంధ్రప్రదేశ్లో కాకినాడ పోర్టు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు అక్రమంగా రవాణా అయిన రేషన్ బియ్యంపై ఐదు విభాగాల అధికారుల బృందం లోతుగా విచారణ జరుగుతుండగా, ఈ పోర్టు యాజమాన్య హక్కులను అక్రమంగా బదలాయించుకున్న తీరుపై సీఐడీ పోకస్ పెంచింది. బుధవారం పోర్టు నాటి యజమాని వెంకటేశ్వరరావు చేసిన ఫిర్యాదు ఆధారంగా గురువారం రంగంలోకి దిగిన సీఐడీ కీలక నిందితులకు లుక్ ఔట్ నోటీసులు జారీ చేసింది. ఈ క్రమంలో గత […]
Bandi Sanjay Kumar comments Congress govt won’t fulfill promises: ఏడాది కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సాధించిందేమీ లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ఈ మేరకు ఆయన గురువారం ఎక్స్ వేదికగా ‘ప్రశ్నిస్తున్న తెలంగాణ’ హ్యాష్ట్యాగ్తో కాంగ్రెస్ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలను పాలించడం కంటే.. కమిటీలు, కమిషన్లతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేసిందని మండిపడ్డారు. ధరణిపై కమిటీ, హైడ్రా, మూసి, ఫోర్త్ సిటీలతో కమిషన్లు వేసి టైమ్ […]
ISRO successfully launches PSLV-C59 rocket with European Space Agency’s Proba-3: శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి పీఎస్ఎల్వీ-సీ59 వాహక నౌక నింగిలోకి విజయవంతంగా దూసుకెళ్లింది. గురువారం సాయంత్రం 4.04 గంటలకు వాహకనౌక నిప్పులు చిమ్ముతూ కక్ష్యలోకి ప్రవేశించింది. ఐరోపా అంతరిక్ష సంస్థ (ఈఎస్ఏ)కు చెందిన ప్రోబా-3తో పాటు మరికొన్ని చిన్న ఉపగ్రహాలను ఇస్రో విజయవంతగా ప్రయోగించింది. ప్రోబా-3 తీసుకుపోయిన రెండు ఉప గ్రహాలను విజయవంతంగా నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టగలిగామని ఇస్రో […]
CM Revanth Reddy at Yuva Vikasam Meeting: తెలంగాణ ఉద్యమంలో ఆర్టీసీ కార్మికులు కీలక పాత్ర పోషించారని, కార్మికులు జంగ్ సైరన్ మోగించి, ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశంసించారు. కాంగ్రెస్ ఏడాది పాలన పూర్తయిన సందర్బంగా నగరంలోని ఎన్టీఆర్ మార్గ్లోని హెచ్ఎండీఏ గ్రౌండ్లో గురువారం నిర్వహించిన సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ రవాణాశాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్ను సీఎం సందర్శించారు. లాభాల్లోకి ఆర్టీసీ కార్మికుల ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా […]
Google Signs Agreement With AP Government Minister Nara Lokesh: కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో అధునాతన ఆవిష్కరణల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, గూగుల్ సంస్థ మధ్య కీలక ఒప్పందం జరిగింది. రాష్ట్ర ఐటి, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజి శాఖల మంత్రి నారా లోకేష్ సమక్షంలో గూగుల్ మ్యాప్స్ ఇండియా జనరల్ మేనేజర్ లలితా రమణి, ఎపి రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖ కార్యదర్శి సురేష్ కుమార్ మధ్య అమరావతిలోని సచివాలయంలో నేడు అవగాహన ఒప్పందం కుదిరింది. […]
Devendra Fadnavis Takeen Oath as Maharashtra CM: మహారాష్ట్రలో ‘మహాయుతి’ ప్రభుత్వం కొలువుదీరింది. గురువారం దక్షిణ ముంబయిలోని ఆజాద్ మైదాన్లో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ చేత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఇదే వేదిక మీద శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ అగ్రనేత అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ముచ్చటగా మూడోసారి.. దేవేంద్ర ఫడ్నవీస్ సీఎంగా మూడోసారి ప్రమాణస్వీకారం చేశారు. […]
Rohit Sharma Confirms KL Rahul Will Open in the 2nd Test match: ఆసీస్తో ఐదు టెస్ట్ల బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో శుభారంభం చేసిన టీమిండియా.. నేడు రెండో టెస్ట్కు సిద్దమైంది. అడిలైడ్లో జరిగే ఈ రెండో టెస్ట్ మ్యాచ్ సందర్భంగా గురువారం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. బ్యాటింగ్ ఆర్డర్పై కీలక వివరాలను వెల్లడించారు. మిడిలార్డర్లో తాను బ్యాటింగ్కు వస్తానని, యశస్వీ జైస్వాల్తో కలిసి కేఎల్ రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభిస్తాడని […]
Burra Venkatesham took charge as the Chairman of TGPSC: రాష్ట్రంలో ఉద్యోగాల నియామకాలు పారదర్శంగా, వేగంగా చేపడుతామని టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. గురువారం నాంపల్లిలోని కమిషన్ కార్యాలయంలో బుర్రా చైర్మన్గా పదవీ బాధ్యతలు చేపట్టారు. కమిషన్ సభ్యులు, సిబ్బంది బుర్రాకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పై పూర్తి స్థాయిలో అభ్యర్థుల్లో తిరిగి విశ్వాసం పెంపొందించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఐఏఎస్ […]
Sharmila Complaints against jagan to ACB: ఆంధ్రప్రదేశ్లో జరిగిన అదానీ విద్యుత్ ఒప్పందంలో భాగంగా జరిగిన అవినీతి మీద విచారణ చేసి, నిందితులెవరో బయటపెట్టాలని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి గురువారం అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ.. అదానీ సోలార్ ఒప్పందంపై నిజాలు నిగ్గు తేల్చాలని ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఆంధ్రలో అవినీతి జరిగితే అమెరికాలో బయట పడిందన్నారు. ఈ ఒప్పందంలో భాగంగా చేతులు మారిన రూ.1750 […]