Home /Author anantharao b
: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్పై భారతీయ అగ్రశ్రేణి రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించిన సమాచారం, సీసీటీవీ ఫుటేజీల కోసం ఐదు దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు ఢిల్లీ పోలీసులు నోటీసు పంపారు
మహిళా స్నేహితురాలిని కాక్పిట్లోకి ఆహ్వానించినందుకు ఇద్దరు ఎయిర్ ఇండియా పైలట్లను సస్పెండ్ చేశారు. కాక్పిట్ నిబంధనలను ఉల్లంఘించినందుకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) ఎయిర్ ఇండియాకు రూ. 30 లక్షల జరిమానా విధించిన ఒక నెల తర్వాత ఇది జరిగింది.
: తమిళనాడు విద్యుత్ శాఖ మంత్రి వి సెంథిల్ బాలాజీ నివాసాలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించింది. మంత్రికి సంబంధించిన పలు ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. ఆర్థిక అవకతవకలు మరియు మనీ లాండరింగ్ ఆరోపణలపై దర్యాప్తులో భాగంగా ఈ దాడులు జరిగాయి
బీహార్ కేబినెట్ మంత్రి సంతోష్ కుమార్ సుమన్ మంగళవారం తన రాజీనామాను సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జితన్ రామ్ మాంఝీ కుమారుడయిన సంతోష్ కుమార్ సుమన్ నితీష్ నేతృత్వంలోని కేబినెట్లో మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ఇటీవల అమెరికా పర్యటన సందర్భంగా వాషింగ్టన్ డీసీ నుంచి న్యూయార్క్ వరకు ట్రక్కులో ప్రయాణించారు.ట్రక్ రైడ్ సమయంలో అతను కొన్ని పాటలను ప్లే చేయమని డ్రైవర్ను అభ్యర్థించారు. ఏ పాట అని అడిగినప్పుడు, అతను సిద్ధూ మూస్ వాలా యొక్క 295 పాటను ప్లే చేయండిఅని బదులిచ్చారు.
బెంగళూరులో షాకింగ్ హత్య కేసు వెలుగులోకి వచ్చింది, 39 ఏళ్ల మహిళ తన తల్లిని హత్య చేసి సూట్కేస్లో కుక్కి మృతదేహంతో పోలీస్ స్టేషన్కు చేరుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిలేకహళ్లి ప్రాంతంలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న సేనాలి సేన్ అనే నిందితురాలు ఆవేశంతో తన 70 ఏళ్ల తల్లి బీవా పాల్ను హత్య చేసింది.
సోషల్ నెట్వర్కింగ్ సైట్ను మూసివేస్తామని భారతదేశం బెదిరించిందని పేర్కొన్న ట్విట్టర్ సీఈఓ జాక్ డోర్సీపై కేంద్రం ఎదురుదాడి చేసింది. 2021లో ట్విటర్ సీఈఓ పదవి నుంచి వైదొలిగిన జాక్ డోర్సే, ప్రభుత్వాన్ని విమర్శించే ఖాతాలను, రైతుల నిరసనలపై నివేదించే వారి ఖాతాలను సెన్సార్ చేయమని, అలాగే ప్లాట్ఫారమ్ను మూసివేస్తామని భారతదేశం నుండి బెదిరింపులు వచ్చాయని ఆరోపించారు.
బిపర్ జోయ్ తుఫాను దృష్ట్యా గుజరాత్లోని సౌరాష్ట్ర మరియు కచ్ తీరాలకు భారత వాతావరణ శాఖ ( ఐఎండి) మంగళవారం ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. జూన్ 15 సాయంత్రానికి బిపర్ జోయ్ తుఫాను జఖౌ పోర్ట్ ప్రాంతాన్ని దాటే అవకాశం ఉంది.
చైనాలో ఉన్న ఏకైక భారతీయ జర్నలిస్టును తమ దేశం నుంచి వెళ్లిపోవాలని బీజింగ్ ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం పీటీఐ రిపోర్టర్ ఒకరు అక్కడే ఉన్నారు. అయితే వీసా పూర్తి అయిన తర్వాత ఆ రిపోర్టర్ ఈ నెలాఖరులోగా చైనాను విడిచి పెట్టి రానున్నారు.
పంచాయతీ ఎన్నికలకు సమీపిస్తున్న తరుణంలో పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. నామినేషన్ సెంటర్ల వద్ద సెక్షన్ 144 సెక్షన్ విధించాలని అధికారులను ఆదేశించింది.