Home / Telangana
నేడు సీఎం కేసీఆర్ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోనున్నారు.శుక్రవారం రోజు కేసీఆర్ దంపతులు లక్ష్మీనరసింహస్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.అంతేకాకుండా సీఎం కేసీఆర్ విమాన గోపురానికి స్వర్ణ తాపడం కోసం బంగారాన్ని కానుకగా ఇవ్వనున్నారని తెలిసిన సమాచరం.సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తుంది.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు జీవన విధానానికి ప్రతీక బతుకమ్మ పండుగ. తొమ్మిది రోజుల పాటు తెలంగాణలోని ప్రతీ వీధిలో ఎక్కడ చూసినా సందడే కనిపిస్తూ ఉంటుంది.
తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ రెండు నాల్కల ధోరణిలో వ్యవహరిస్తోందని మంత్రులు హరీష్ రావు, దయాకరరావు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ జల్ జీవన్ మిషన్ ద్వారా మిషన్ భగీరథ పథకానికి, రాష్ట్ర ప్రభుత్వ పని తీరును ప్రశంసిస్తూ అక్టోబర్ 2వ తేదీన మీ రాష్ట్రానికి అవార్డు ఇస్తాం. స్వీకరించడని కేంద్రం కోరడం జరిగిందని వారు తెలిపారు
ఈ విద్యా సంవత్సరం నుంచి తెలంగాణకు చెందిన ఎంబీబీఎస్ అభ్యర్థులకు 24 ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో 1068 అదనపు ఎంబీబీఎస్ సీట్లలో ప్రవేశం కల్పించనున్నారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిషన్ భగీరథ పధకం కేంద్రం యొక్క జల్ జీవన్ మిషన్ అవార్డుకు ఎంపికైంది. ప్రతి ఇంటికి కుళాయిల ద్వారా శుద్ధి చేసిన తాగునీరు అందించడం ఈ పధకం లక్ష్యం.
తెలంగాణకు మరోసారి రెయిన్ అలెర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. వర్షాలు ప్రజలను మరల ఇబ్బంది పెట్టనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వానల ధాటికి పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. ఈ తరుణంలో మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది.
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇంట ఒకే ఏడాదిలో వరుసగా రెండు విషాదాలు చోటుచేసుకున్నాయి. గత కొద్దినెలల క్రితం అన్నయ్య రమేష్ బాబు మరణించగా, 28 సెప్టెంబర్ 2022 బుధవారం ఉదయం తల్లి ఇందిరా దేవి మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన నివాసంలో మంగళవారం అర్ధరాత్రి చోరీకి యత్నం జరిగింది.
అమావాస్య నాడు మొదలయిన బతుకమ్మ పండుగను అక్టోబర్ 3 వరకు జరుపుకోనున్నారు. తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ (బతుకమ్మ) తో ఈ పండుగ ముగుస్తుంది. ఈ పండుగ ముఖ్యంగా బతుకమ్మను పూలతో అలంకరించి, ప్రసాదాలతో బతుకమ్మను పూజిస్తారు.
తెలంగాణ రాష్ట్రంలోని 416 ఆస్పత్రులకు నోటీసులు జారీ చేశామని హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా క్లినిక్ లు, ఆస్పత్రులను తనిఖీలు చేస్తున్నామన్నారు.
రంగారెడ్డి కోర్టులో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు చేదు అనుభవం ఎదురైంది. బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు ఆమె కోర్టుకు వచ్చారు. అయితే కవితను న్యాయవాదులు అడ్డుకొన్నారు. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. తమ సమస్యలను పట్టించుకోకుండా, కోర్టుకు ఎలా వస్తారని కవితను నిలదీసారు.