Home / Telangana News
రాజకీయాలు రాజకీయాలే. ప్రభుత్వం ప్రభుత్వమే. ఇది మరిస్తే ఎవరికైనా పరాభవం తప్పదు. వ్యవస్ధలను అడ్డుపెట్టుకొని పాలన చేస్తున్నారని పదే పదే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న తెలంగాణ సీఎం కేసిఆర్ రాజ్యాంగ బద్ధ వ్యవస్ధలను అగౌరపరుస్తున్నారని తెలుసుకోలేకపోతున్నారు.
సూర్యగ్రహణం కారణంగా మంగళవారం నాడు రాష్ట్రంలోని పలు దేవాలయాలు మూతపడనున్నాయి. భక్తులకు తిరిగి బుధవారం దర్శనం కల్పించనున్నారు. ఈ క్రమంలోనే యాదాద్రీశుడి దేవాలయాన్ని కూడా మూసివేస్తున్నట్టు అధికాలు తెలిపారు.
అధికార బలం, తాయిలాలు, హామీలు మాటున మునుగోడు ఉప ఎన్నికల్లో పలు పార్టీలు పోటా పోటీలు పడుతూ ఓటర్లను ఆకర్షించేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నాయకురాలు, ములుగు శాసనసభ్యురాలు ధనసారి అనసూయ (సీతక్క) మాత్రం తనదైన శైలిలో ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ గొప్పతనాన్ని చెప్పుకుంటూ ప్రచారంలో ముందుకు సాగుతున్నారు.
విహార యాత్ర అతనిపాలిట మృత్యువుగా మారింది. స్నేహితులతో సరదా కాస్తా నిండు ప్రాణాన్ని బలిగొన్న ఆ ఘటన ములుగు జిల్లాలో చోటుచేసుకొనింది.
కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జోడో యాత్ర.. నేడు తెలంగాణలోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో . కర్ణాటక సరిహద్దులో ఉన్న గూడబెల్లూరులో ఎంట్రీ ఇవ్వడంతో తెలంగాణలో జోడో యాత్ర ప్రారంభమయింది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.
రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో అభ్యర్ధి గుర్తును రిటర్నింగ్ అధికారి మార్చేశారు. ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది.
భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో విషపు మొక్కలు నాటుతోందని తెలంగాణ ములుగు ఎమ్మెల్యే సీతక్క మండిపడ్డారు. ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న భారత జోడో యాత్రలో భాగంగా ఆమె ఆదోని మండలంలో రాహుల్ తో కలసి పాదయాత్రలో పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీకి హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కొన్ని గుర్తులను తొలగించేలా ఎన్నికల కమీషన్ కు ఆదేశాలు ఇవ్వాలంటూ హైకోర్టును ఆశ్రయించిన పిటిషన్ ను ధర్మాసనం కొట్టివేసింది.