Home / national news
దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కోవిడ్ బూస్టర్ డోస్పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 18 ఏళ్లు పైబడ్డ వారందరికీ బూస్టర్ డోస్ ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్రం నిర్ణయంతో ఎల్లుండి నుంచి దేశవ్యాప్తంగా ఉచితంగా బూస్టర్ డోస్ అందించనున్నారు.
మహారాష్ట్ర ప్రభుత్వం ఔరంగాబాద్ పేరు మార్చుతూ తీసుకున్న నిర్ణయం హాస్యస్పదమని ఏఐఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ అన్నారు. దీనిపై ఆయన ఎన్ సి సి అధినేత శరద్ పవార్ పై విమర్శలు గుప్పించారు.దీన్ని హిందూ-ముస్లిం సమస్యగా మార్చే వారు చాలా మంది ఉన్నారు. ఇది హిందువులు మరియు ముస్లింల గురించి కాదు.