Home / national news
తనలోని ఆడతనాన్ని మరచింది. స్వార్థ ప్రయోజనాల కోసం సభ్య సమాజం తలదించుకునేలా ప్రవర్తించిన ఓ ఘటన సోషల్ మీడియా వేదికగా బయటపడింది. పంజాబ్లోని చండీగఢ్ యూనివర్సిటీలోని దాదాపు 60మంది అమ్మాయిల వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టింది ఓ యువతి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో శనివారం జరిగిన ‘స్వచ్ఛత పఖ్వాడా’ కార్యక్రమంలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ పాల్గొన్నారు.దీనిలో భాగంగా ఆయన ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్లో చీపురు పట్టి ఊడ్చారునేటి నుండి, దేశంలోని భారతీయ రైల్వేలు, పోస్టాఫీసులు, టెలికాం, ఐటీ మరియు ఇతర విభాగాలలో పరిశుభ్రత కోసం ప్రచారం ప్రారంభమైంది.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్ సి టిసి ) కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును శనివారం ఆశ్రయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్ సి టి సి హోటళ్ల నిర్వహణ ఒప్పందాల మంజూరు కేసులో తేజస్వి బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.
జార్ఖండ్లో ప్రయాణికులతో వెళ్తున్న బస్సు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయినట్టు తెలుస్తోంది. పలువురు నీటిలో చిక్కుకున్నారు.
బాలీవుడ్ బాద్ షా, సూపర్ స్టార్ షారుక్ ఖాన్ కూడా సోషల్ మీడియా వేదికగా ప్రధాని మోదీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దానిలో ఏముంది ప్రత్యేక అనుకుంటున్నారా అందులోనే ట్విట్ట్ ఉందండోయ్...
జాన్సన్ బేబీ పౌడర్లు, సబ్బులు, క్రీములు వాడకుండా పిల్లలు పెద్దయ్యి ఉండరు అనడంలో అతిశయోక్తి లేదు. ఆనాటి నుంచి ఇప్పుడే పుట్టిన నవజాత శిశివులకు వాడే ప్రొడక్ట్స్ ఏమైనా ఉన్నాయా అంటే అవి జాన్సన్ అండ్ జాన్సన్ ప్రొడక్టులనే చెప్పవచ్చు. అయితే తాజాగా జాన్సన్ బేబీ పౌడర్ ఉత్పత్తి లైసెన్సును మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.
ప్రధాని నరేంద్రమోదీ నమీబియా నుంచి తీసుకువచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ లో విడిచిపెట్టిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో 'ప్రాజెక్ట్ చిరుత' ప్రతిపాదనను 2008-09లో అప్పటి మన్మోహన్ సింగ్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆమోదించిందని కాంగ్రెస్ పేర్కొంది.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినం సందర్భంగా శనివారం ఎనిమిది ఆఫ్రికన్ చిరుతలను నమీబియా నుండి మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో విడిచిపెట్టారు. దేశంలోని వన్యప్రాణులు మరియు ఆవాసాలను పునరుజ్జీవింపజేసేందుకు మరియు వైవిధ్యపరిచే తన ప్రయత్నాలలో భాగంగా మరియు మూడు మగ చిరుతలను పార్క్లోకి విడుదల చేసారు.
నమీబియా నుంచి తీసుకొచ్చిన చిరుతలను మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విడిచిపెట్టారు. ఈ ఉదయం నమీబియా నుండి తీసుకొచ్చిన 8 చిరుతలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్లు గ్వాలియర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుండి కునో నేషనల్ పార్క్కు తీసుకువెళ్లాయి.
మాయమాటలతో యువకులకు గాలం వేసి పెళ్లాడడం, ఆపై వారి దగ్గరి నుంచి నగదు, నగలతో పరారు కావడం ఆమెకు వెన్నతో పెట్టిన విద్య. సీన్ కట్ చేస్తే మంత్రి మా బంధువని కొంతమందిని, పోలీసు శాఖలో పలుకుబడి ఉందని మరికొందరి దగ్గర నమ్మపలికింది. 5 మందిని పెళ్లాడి చివరకు కటకటాలపాలయ్యింది.