Home / latest Telangana news
విధుల్లో ఉన్న ఇన్స్పెక్టర్ని బెదిరించినందుకుగానూ ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదైంది. హైదరాబాద్లోని మంగళవారం రాత్రి సంతోష్ నగర్ పిఎస్ పరిధిలోని మొయిన్ బాగ్లో ఎంఐఎం బహిరంగ సభ నిర్వహించారు. అయితే రాత్రి 10 గంటలకి కావస్తుండటంతో విధుల్లో ఉన్న సంతోష్ నగర్ ఇన్స్పెక్టర్ శివచంద్ర ప్రచార గడువు ముగిసిందని అక్బరుద్దీన్కి చెప్పేందుకు స్టేజిపైకి వెళ్ళారు.
తెలంగాణలో డిసెంబర్ 3వ తేదీన కౌటింగ్ చేపట్టేందుకు ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ నేపథ్యంలో ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం లెక్కింపునకు సంబంధించి ఇప్పటి నుంచే సర్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే 33 జిల్లాల్లో 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
:నేడు పవన్ కళ్యాణ్ వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. బీజేపీ నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభలో సేనాని పాల్గొననున్నారు. బీజేపీ జనసేన పొత్తులో భాగంగా జనసేన అధినేత ప్రచారం నిర్వహించనున్నారు. వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థి రావు పద్మ, వరంగల్ తూర్పు బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావులకు మద్దతుగా సభ ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో.. ఎన్నికల సంఘం ఏర్పాట్లను పూర్తి చేస్తోంది. తాజాగా, ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఖరారు చేసింది. 49 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ మేరకు రాష్ట్ర అధికారులు పంపిన ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోద ముద్ర వేసింది.
తెలంగాణ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రచారానికి సంబంధించిన షెడ్యూల్ ఖరారైందని తెలిసింది. 22న వరంగల్, సూర్యాపేట, 23న తాండూర్, 24న కూకట్ పల్లి, 25న ఎల్బి నగర్, కుత్బుల్లాపూర్, సికింద్రాబాద్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయనున్నారు.
హైదరాబాద్ లో జరిగే ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకల్లో "సదర్" కూడా ఒకటి. ఈ పండుగను దీపావళి ఉత్సవాల్లో భాగంగా పండుగ ముగిసిన రెండో రోజున నిర్వహిస్తారు. అలంకరించిన దున్నపోతులతో యువకులు కుస్తీ పట్టడం ఆనవాయితీగా వస్తుంది. దున్నపోతుల ఉత్సవంగా కూడా వ్యవహరించే పండుగను పురస్కరించుకొని వివిధ
తెలంగాణ అసెంబ్లీ బరిలో నిలుచున్న అభ్యర్దులందరిలో అత్యంత ధనవంతుడు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డని వార్తలు వచ్చాయి. అయితే నామినేషన్ల ఘట్టం ముగిసేనాటికి అత్యంత ధనవంతుడిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన గడ్డం వివేకానంద నిలిచారు
తెలంగాణలో ఎన్నికల వేడి రోజు రోజుకు పెరిగిపోతుంది. ఇక నామినేషన్ల ఘట్టం ముగియడంతో ఇవాళ నామినేషన్ల పరిశీలన అంకం మొదలైంది. ఈ నెల 15వ తేదీలోపు నామినేషన్ల ఉపసంహరణకు ఈసీ గడువు విధించింది. పోటీ నుంచి తప్పుకోవాలనుకున్నవారు 15లోపు ఉపసంహరించుకోవాలని సూచించింది.
హైదరాబాద్ నాంపల్లిలో చోటు చేసుకున్న ఘోర అగ్ని ప్రమాదంపై జనసేన అదినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ ఘటనలో తొమ్మిది మంది మృత్యువాతపడ్డారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
దొంగల రాజ్యం.. దోపిడి రాజ్యం మనకు వద్దు అంటూ ప్రతిపక్షాలపై తనదైన శైలిలో సీఎం కేసీఆర్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలోని దమ్మపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR) హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ఎన్నికలు వచ్చాయని