Home / latest Telangana news
హైదరాబాద్లోని తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాలపై ఆదాయపన్ను శాఖ అధికారులు సోమవారం సోదాలు నిర్వహించారు.గచ్చిబౌలిలోని ఓ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ప్రదీప్ నివాసంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేశారు. ప్రదీప్ మంత్రికి దగ్గరి బంధువు. సబితా ఇంద్రారెడ్డి ఇతర బంధువుల నివాసాల్లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
హైదరాబాద్ లోని నాంపల్లిలో గల బజార్ ఘాట్లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా.. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకొని 6 వాహనాల్లో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. తెల్లవారుజామున మంటలు చెలరేగగా
హైదరాబాద్ అపోలోలో చికిత్స పొందుతున్న అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారక రామారావు పరామర్శించారు. బాలరాజు ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లని అడిగి కేటీఆర్ తెలుసుకున్నారు. ప్రజాదరణ ఓర్వలేకనే తమపై దాడులకు తెగబడుతున్నారని కేటీఆర్కి బాలరాజు కుటుంబ సభ్యులు తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ మరోసారి తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. కొద్ది రోజుల క్రితమే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్లో నిర్వహించిన బీజేపీ బీసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు మోదీ. ఇక ఈ క్రమంలోనే ఈరోజు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ..
ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ప్రభుత్వాన్ని సాగనంపడానికి తెలంగాణ ప్రజలు నవంబర్ 30 కోసం ఎదురుచూస్తున్నారని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. కామారెడ్డిలో శుక్రవారం రేవంత్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్బంగా జరిగిన బహిరంగ సభలో కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ ప్రకటించారు.
తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేయనున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో పోటీదారులందరిలో అత్యంత ధనవంతుడుగా నిలిచారు. రాజగోపాల్రెడ్డి గురువారం నామినేషన్ పత్రాలతో పాటు ఎన్నికల అధికారుల ముందు దాఖలు చేసిన అఫిడవిట్లో తనకు, తన భార్య లక్ష్మికి రూ.458.37 కోట్ల ఆస్తులు ఉన్నాయని ప్రకటించారు.
తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో.. అనేక ఆశ్చర్య సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఓ ఘటన విషయంలో కూడా అదే జరిగినట్లు తెలుస్తోంది. ఇక విషయానికొస్తే.. ఆమె పక్కన సోదరుడు తప్ప మరెవరూ లేరు. ఆమెకు నా అని అనుకునే నాయకుడు కూడా లేరు. పిలిచి టికెట్ ఇచ్చేవారు అంతకన్నా లేరు.
మంత్రి కేటీఆర్ మైనార్టీలతో తెలంగాణ భవన్లో సమావేశం అయ్యారు. ఇక ఈ మీటింగ్ అనంతరం.. ఆయన ఓ కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో మైనార్టీల విషయంలో వచ్చిన అంశంపై మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. మైనారిటీల విషయంలో కాంగ్రెస్, భాజపా ఆలోచనలు ఒకేలా ఉన్నాయన మంత్రి కేటీఆర్ అన్నారు.
మాజీ ఎంపీ, పాలేరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో, ఆఫీస్ లో రెండో రోజు కూడా ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఖమ్మంలోని పొంగులేటి ఇళ్లు, కార్యాలయాలతో పాటు హైదరాబాద్ లోని మొత్తం 30 ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల నుంచి ఈ సోదాలు ప్రారంభం
టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద లో మైనార్టీ డిక్లరేషన్ను విడుదల చేసారు. ఈ సందర్బంగా రేవంత్ మాట్లాడుతూ మైనార్టీల సంక్షేమానికి ఏడాదికి రూ.4 వేల కోట్ల బడ్జెట్ కేటాయిస్తామన్నారు. ప్రత్యేక మైనారిటీ సబ్ ప్లాన్ కింద సబ్సిడీ రుణాలు ఇవ్వడానికి ఏడాదికి రూ.వెయ్యి కోట్లు మంజూరు చేస్తామన్నారు.