Home / latest national news
కేంద్ర ప్రభుత్వం ఆదివారం నాడు ఢిల్లీ-ఎన్సిఆర్ మరియు రిటైల్ మార్కెట్లలోని ఇతర ప్రదేశాలలో తక్షణమే అమలులోకి వచ్చేటటువంటి రాయితీతో కూడిన టమోటాల ధరను కిలోకు రూ.90 నుండి రూ.80కి తగ్గించింది. దేశంలోని 500 పైగా ప్రదేశాల్లో పరిస్థితిని అంచనా వేసిన తర్వాత టమోటాల ధరలను తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు.
మధ్యప్రదేశ్ లోని దతియా జిల్లాలో ఒక మహిళపై సామూహిక అత్యాచారం మరియు ఆమె మైనర్ సోదరిపై లైంగిక వేధింపులకు పాల్పడిన నలుగురు నిందితులలో మధ్యప్రదేశ్ బీజేపీ నాయకుడి కుమారుడు కూడా ఉన్నాడు. బాధితురాలి బంధువులు మరియు స్థానికులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టారు. దీనితో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.
జమ్మూ కాశ్మీర్ రాజౌరీకి చెందిన మహిళ, పెళ్లి సాకుతో 20 మందికి పైగా పురుషులను మోసం చేసిన కేసు వెలుగులోకి వచ్చింది. 20 మంది పురుషులు తమ భార్యలు తప్పిపోయారంటూ కంప్లైంట్ ఇవ్వడానికి కాశ్మీర్ పోలీసులను సంప్రదించారు. అయితే అక్కడే ట్విస్ట్ ఉంది. వీరు సబ్మిట్ చేసిన ఫోటోలన్నింటిలో ఉన్నది ఒకే మహిళ కావడం విశేషం.
పర్యాటకాన్ని పెంపొందించడం మరియు శాంతిని పెంపొందించే లక్ష్యంతో ఒక ముఖ్యమైన చర్యలో, ఉత్తర కాశ్మీర్లోని బారాముల్లా మరియు కుప్వారా జిల్లాల్లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసి) ప్రాంతాలలో సరిహద్దు పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న శాంతియుత వాతావరణం ఫలితంగా ఈ చొరవ వచ్చింది.
మణిపూర్లో నెలకొన్న పరిస్థితులపై, యూరోపియన్ పార్లమెంట్లో చర్చిస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ శనివారం మండిపడ్డారు. మణిపూర్ పరిస్దితిపై స్పందించని ప్రధాని మోదీ ఫ్రాన్స్ లో బాస్టిల్ డే పరేడ్ కు వెళ్లారంటూ విమర్శించారు.
దేశవ్యాప్తంగా టమోటా ధరలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో మహారాష్ట్రలోని పూణె జిల్లాలో టమోటా సాగు చేసిన ఓ రైతుకు జాక్పాట్ తగిలింది. తుకారాం భాగోజీ గయాకర్ మరియు అతని కుటుంబం నెలలో 13,000 టొమాటో క్రేట్లను (బాక్సులు) విక్రయించడం ద్వారా రూ. 1.5 కోట్లకు పైగా సంపాదించారు.
Heavy Rains: ఉత్తరాది రాష్ట్రాలను వర్షాలు వణికిస్తున్నాయి. దేశరాజధాని ఢిల్లీ సహా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్, ఇంకా దేశంలోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా భారీవర్షాలు కురుస్తున్నాయి.
Today Gold And Silver Price: మహిళలకు షాపింగ్ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది బట్టలు, నగలు. అందులోనూ వారు అత్యంతగా ఇష్టపడేది పసిడి. ఇక బంగారం రేటు విషయానికి వస్తే రోజులు గడుస్తున్నకొద్దీ రేట్లలో తేడా వస్తుంది తప్ప తగ్గడం తక్కువగానే ఉందని చెప్పాలి.
Chandrayaan-3: ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ –3 ప్రయోగానికి కౌంట్డౌన్ మొదలయ్యింది. ఏపీలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2.35కు ఎల్వీఎం-3 ఎం4 రాకెట్ ద్వారా చంద్రయాన్ ల్యాండర్, రోవర్ను చంద్రుడిపైకి పంపనున్నారు శాస్త్రవేత్తలు.
బీహార్ లోని బక్సర్లో దక్షిణ భారత వంటకాలను అందిస్తున్న రెస్టారెంట్ దోశతో సాంబార్ను అందించకపోవడంతో వినియోగదారుల కోర్టు ఆగ్రహానికి గురయింది. రూ.140 ధర కలిగిన ‘స్పెషల్ మసాలా దోశ’తో సాంబార్ను అందించనందుకు రెస్టారెంట్కు రూ.3,500 జరిమానా విధించారు.