Home / Election Commission
ఆంధ్రప్రదేశ్ కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ)గా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి హరీష్ కుమార్ గుప్తాను ఎన్నికల సంఘం నియమించింది. ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు వెంటనే వెలువడ్డాయని, ఆలస్యం చేయకుండా విధుల్లో చేరాలని ఆదేశించారు.
కేసీఆర్ 48 గంటల పాటు ప్రచారం చేయకుండా నిషేధం విధించిన ఎన్నికల సంఘం కాంగ్రెస్కు వ్యతిరేకంగా అవమానకరమైన మరియు అభ్యంతరకరమైన ప్రకటనలు చేసినందుకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కె చంద్రశేఖర్ రావు బుధవారం రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ప్రచారం చేయకుండా భారత ఎన్నికల సంఘం నిషేధించింది.
రాజకీయాల్లో ఏదైనా సంభవమే అన్నట్లు ,ఎన్నికల్లో ఒక వేళ నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే పరిస్థితి ఏంటి అనే ప్రశ్న చాలామందిలో కలుగుతుంది .దీనిపై ప్రముఖ వ్యక్తిత్వ వికాస రచయిత శివ్ ఖేరా సుప్రీంకోర్టు లో పిల్ వేశారు .ఎన్నికల్లో నోటా కు అత్యధికంగా ఓట్లు వస్తే.. సదరు నియోజకవర్గం ఫలితాన్ని రద్దు చేసి కొత్తగా పోలింగ్ నిర్వహించాలని కోరుతూ సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు చేసారు . దీనిని పరిశీలించిన సుప్రీం ధర్మాసనం.. ఈ అంశంపై భారత ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది.
మీరు గెలిపించకపోతే డిసెంబర్ 4న నా శవయాత్రకి రావాలంటూ హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎన్నికల సంఘం(ఈసీ) సీరియస్ అయింది. తక్షణమే ఈ వ్యాఖ్యలపై స్థానిక రిటర్నింగ్ అధికారికి వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. నియోజకవర్గంలో జరిగిన ప్రచార సభలో కౌశిక్ రెడ్డి తనకి ఓటేయాలంటూ అడిగిన సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఎన్నికల సమాయాన్ని దృష్టిలో పెట్టుకుని రైతు బంధుపై నిఘా ఉంచాలని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించింది. 2018లో పోలింగ్ రోజు రైతు బంధు పంచారని ఈసారి కూడా అలాగే పంచే అవకాశం ఉందని పేర్కొన్నారు.
బాలీవుడ్ నటుడు రాజ్కుమార్ రావు ను నేషనల్ ఐకాన్ గా నియమిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. గురువారం అతడిని అధికారికంగా నియమించనున్నారు. ఎన్నికలలో పాల్గొనేలా ఓటర్లను ప్రేరేపించేందుకు ఎన్నికల కమీషన్ పలువురు ప్రముఖలను నేషనల్ ఐకాన్లుగా నియమిస్తోంది. దీనిలో భాగంగానే రాజ్ కుమార్ రావు నియామకం జరగనుంది.
ఏపీలో దొంగ ఓట్ల వ్యవహారం గత కొంతకాలంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలోనే దొంగ ఓట్లు ఎక్కువగా నమోదవుతున్నాయని కేంద్ర ఎన్నికల సంఘానికి ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా ఇప్పుడు తాజాగా ఆయన ఫిర్యాదుకు ఎలక్షన్ కమిషన్ సమాధానం ఇచ్చింది. ఎంపీ రఘురామకు
ఆంధ్రప్రదేశ్ లో దొంగ ఓట్ల పంచాయితీ ఢిల్లీకి చేరింది. సీఈసీతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఏపీ ఓటర్ల జాబితాలో అవకతవకలపై ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఓట్లు తొలగించారని ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్నారని కంప్లైంట్ చేశారు.
తెలంగాణలో సాధారణ ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. ఇందుకోసం అధికారులకు వరుసగా ట్రైనింగ్ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనుంది.
కర్ణాటక ప్రతిష్ట, సార్వభౌమాధికారం లేదా సమగ్రతకు ముప్పు కలిగించేలా కాంగ్రెస్ ఎవరినీ అనుమతించదు అని కాంగ్రెస్ నేత సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ ) ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కర్ణాటకలో ఎన్నికల ప్రచారం సందర్బంగా శనివారం జరిగిన ర్యాలీలో ఆమె ప్రసంగించారు.