Home / Delhi
ఢిల్లీలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) ప్రధాన కార్యాలయానికి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు. కేంద్ర ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ భద్రతను మంజూరు చేసిందని అధికారిక వర్గాలు తెలిపాయి.
సీబీఐ ఘజియాబాద్లోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ బ్రాంచ్లో ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా లాకర్ను తనిఖీ చేసింది. ఢిల్లీలో కొత్త ఎక్సైజ్ పాలసీ అమలులో అవినీతి జరిగిందని సీబీఐ ఆరోపించింది. ఈ నేపధ్యంలో తన బ్యాంక్ లాకర్పై సెంట్రల్ ఏజెన్సీ దాడులు చేస్తుందని సిసోడియా సోమవారమే పేర్కొన్నారు.
సోమవారం ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సెషన్లో మధ్య ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ప్రతిపాదించిన విశ్వాస తీర్మానం సభలో చర్చనీయాంశంగా మారుతోంది. దేశ రాజధానిలో ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వాదనల మధ్య అరవింద్ కేజ్రీవాల్ నేడు మెజారిటీ పరీక్షకు హాజరుకానున్నారు.
గురువారం రాజ్ఘాట్లో మహాత్మాగాంధీకి నివాళులర్పించిన అనంతరం ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ రూ.800 కోట్లు ఆఫర్ చేసి తమ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఒక్కొక్కరికి రూ.20 కోట్లతో కొనడమే
తాను బీజేపీలో చేరితే తనపై ఉన్న సీబీఐ, ఈడీ కేసులను ఎత్తేస్తామని బీజేపీ నుంచి తనకు సందేశం వచ్చిందని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా చెప్పారు. అయితే బీజేపీలో చేరడం కంటే తన తల నరుక్కుంటానని ఆయన అన్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దూకుడు పెంచింది. దర్యాప్తులో భాగంగా ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలో 21 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
ఢిల్లీలో ఐదవ మంకీ పాక్స్ కేసు నమోదు అయ్యింది. ఆఫ్రికా జాతికి చెందిన 22 ఏళ్ల యువతికి పరీక్షలు నిర్వహించగా పాజిటివ్గా తేలిందని లోక్నాయక్ జయప్రకాశ్ నారాయణ్ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్కుమార్ తెలిపారు.
దేశ రాజధాని ఢిల్లీలో కొత్త కోవిడ్ -19 కేసులు అకస్మాత్తుగా పెరిగిన నేపథ్యంలో, ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు ధరించడం తప్పనిసరి చేసింది . దీన్ని ఉల్లంఘించిన వారికి రూ. 500 జరిమానా విధిస్తారు. బహిరంగ ప్రదేశాల్లో ప్రజలు మాస్క్లు ధరించడం లేదని గుర్తించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఢిల్లీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబకు ఊహించని పరిణామం ఎదురైయింది. చంద్రబాబు ముందే టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబుకు బొకే ఇచ్చేందుకు ఎంపీ కేశినేని నాని నిరాకరించారు. బొకే ఇవ్వాలని గల్లా జయదేవ్ బతిమాలిన లెక్కచేయలేదు. చేతికి ఇచ్చిన బొకేను చంద్రబాబు ముందే తోసేశారు.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై ముగ్గురు వ్యక్తులు వసంత్ విహార్ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా ఈ సంఘటన ఈ నెల 6న జరగ్గా, పోలీసులకు 8వ తేదీన ఫిర్యాదు అందింది. అత్యాచారానికి పాల్పడిన 23 , 25, 35 ఏళ్ల వ్యక్తులపై వివిధ సెక్షన్ల కింది కేసు నమోదు చేశారు. దీంతో పాటు పోస్కో యాక్ట్ కింది కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.