Home / cm jagan
ఉభయ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటనకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గం విజయరాయిలో ఇదేం ఖర్మ పేరుతో టీడీపీ అధినేత చంద్రబాబు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విరుచుకుపడ్డారు.
పిల్లల చదువుకు పేదరికం ఆటంకం కాకూడదని వారికి మనం ఇచ్చే ఆస్తి చదువేనని సీఎం జగన్ పేర్కొన్నారు. నేడు అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటనలో భాగంగా జగనన్న విద్యాదీవెన నిధులను విడుదల చేశారు సీఎం జగన్. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి 11 లక్షల 2 వేల మంది విద్యార్థులకు 684 కోట్ల నిధులను నేరుగా తల్లుల ఖాతాల్లోకే బటన్ నొక్కి జమ చేశారు.
వాల్మీకి, బోయ, బెంతు కులాలను ఎస్టీల్లో చేర్చవద్దని గత కొంతకాలంగా గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటి ముట్టడికి గిరిజన సంఘాలు పిలుపునిచ్చాయి. దానితో జగన్ నివాసం చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికార భగ్నప్రేమికుడని సీఎం జగన్మోహన్ రెడ్డి ఎద్దేవా చేసారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో జగన్ ప్రసంగించారు.
ఆంధ్రప్రదేశ్లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.
ఏపీ విశాఖపట్నంలోని ఆంధ్రా యూనివర్శిటీ మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన ప్రధాని మోదీ తెలుగు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఇకపోతే ఇదీ సభపై ప్రసంగించిన ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో తమ అనుబంధం పార్టీలు రాజకీయాలకు అతీతమని పేర్కొన్నారు.
పవన్ వ్యాఖ్యలకు అవనిగడ్డ వేదికగా సీఎం జగన్ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. ఏం చేయలేనివాళ్లు బూతులు తిడుతున్నారని, చెప్పులు చూపిస్తూ దారుణమైన మాటలు మాట్లాడుతున్నారని ఆయన ఫైర్ అయ్యారు. వీధి రౌడీలు కూడా ఇలా మాట్లాడరంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కృష్ణా జిల్లా అవనిగడ్డలో గత కొద్దికాలంగా నిషేధిత భూములకు సంబంధించి ఆ ప్రాంత ప్రజల పోరాటాలు చేస్తున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వానికి అనేక సార్లు వినతులు సమర్పించారు. కాగా ఎట్టకేలకు ప్రజల గోడు విన్న సీఎం జగన్ వారికి శుభవార్త చెప్పారు. నేడు ఆయన అవనిగడ్డలో పర్యటిస్తున్నారు.
సీఎం జగన్ ఈనెల 27న పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరులో ఏపీ జెన్కో థర్మల్ పవర్ స్టేషన్లోని మూడో యూనిట్ను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
సీఎం జగన్ శాడిస్టునా కొడుకు.. తుగ్లక్ నా కొడుకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు..