Home / Bihar
ఎవరైనా కూరలో ఉప్పు తక్కువైతే కాస్త ఉప్ప వేసుకుని తింటారు. లేదా ఇంకేం వేసుకుంటాములే అని సర్దుకుపోయి తింటారు. మహా అంటే వంట చేసిన భార్యని నాలుగు మాటలంటారు. కానీ ఈ ప్రబుద్ధుడు మాత్రం కూరలో ఉప్పచాలలేదని కట్టుకున్న భార్యనే కడతేర్చాడు. ఈ దారుణ ఘటన బిహార్ రాష్ట్రంలో వెలుగు చూసింది.
బీహార్ మహిళ,శిశు సంక్షేమ విభాగానికి ఎండీగా ఉన్న హర్జోత్ కౌర్ బుమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సశక్తి బేటీ, సమృద్ధి బిహార్ కార్యక్రమానికి హాజరైన ఆమె ఒక విద్యార్దిని ఉచితంగా శానిటరీ ప్యాడ్స్ అందించాలని కోరగా రేపు కండోమ్స్ కూడా అడుగుతారంటూ సంచలన వ్యాఖ్యలు చేసారు.
వారిరువు వరుసకు అన్నా చెల్లెళ్లు. ఆ ఇద్దరి వయసు 15 ఏళ్లే. పాఠశాలకు వెళ్లివస్తోన్న క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. దానితో బాలిక గర్భం దాల్చింది. తీరా చూస్తే ఏడునెలల గర్బం అని తెలిసి భయపడి పారిపోయి భాగ్యనగరానికి చేరుకున్నారు. ఈ ఉదతం బిహార్లో చోటుచేసుకుంది.
పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ)పై కేంద్రం ఐదేళ్ల పాటు నిషేధం విధించిందన్న వార్తల నేపథ్యంలో ఆర్జేడీ అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ ట్విట్టర్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) పై విరుచుకుపడ్డారు.
వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీజేపీని ఎలాగైనా గద్దెదించాలని ప్రతిపక్షాలన్నీ సిద్దమవుతున్నాయి. విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చి జాతీయ స్థాయిలో మహాకూటమిని ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టుగా కనిపిస్తున్నాయి. ఈ సందర్భంగా బీహార్లో అధికార కూటమికి చెందిన ఇద్దరు అగ్రనేతలు నేడు కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమవనున్నారు.
బీహార్ లోని నితీష్ కుమార్ ప్రభుత్వం బుజ్జగింపు రాజకీయాల వల్లే రాష్ట్రంలో ఉగ్రవాద సంస్థలు విజృంభిస్తున్నాయని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ఆరోపించారు
బీహార్ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా పలు చోట్ల పిడుగులు పడడంతో పలువురు చనిపోయిన ఘటనలు చోటుచేసుకున్నాయి. రాష్ట్రంలోని మూడు జిల్లాల్లో పిడుగుపాటుకు 11 మంది మృత్యువాతపడ్డారు
బీహార్లోని ముజఫరా పూర్ పట్టణంలో పట్టపగలు దొంగలు రెచ్చిపోయారు. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి 14 లక్షల రూపాయలు దోచుకుపోయారు. సదర్బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోబర్షాహి బ్రాంచిలో ఈ సంఘటన జరిగింది.
ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అద్యక్షుడు రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లాలన్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నుండి వచ్చిన ఆఫర్ ను తిరస్కరించిన్నట్లు చెప్పడమే అందుకు కారణమన్నారు. గత కొంతకాలంగా భారతీయ జనతా పార్టీకి ప్రశాంత్ కిషోర్ పనిచేస్తున్నారని తెలుసన్నారు.
ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ( ఐఆర్ సి టిసి ) కుంభకోణంలో బీహార్ ఉప ముఖ్యమంత్రి, రాష్ట్రీయ జనతాదళ్ నాయకుడు తేజస్వీ యాదవ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ ) ఢిల్లీలోని రూస్ అవెన్యూ కోర్టును శనివారం ఆశ్రయించింది. ఒక ప్రైవేట్ సంస్థకు రెండు ఐఆర్ సి టి సి హోటళ్ల నిర్వహణ ఒప్పందాల మంజూరు కేసులో తేజస్వి బెయిల్ను రద్దు చేయాలని సీబీఐ కోరింది.