Home / ap assembly
ఎన్టీఆర్ వర్శిటీ పేరును ఇకపై వైఎస్ఆర్ వర్శిటీగా మారుస్తూ ఏపీ శాసనసభ ఆమోద ముద్ర వేసింది. మంత్రి విడదల రజనీ సభలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేశారు.
ఎన్టీఆర్ పేరు పలకడం కూడ చంద్రబాబుకు ఇష్టం ఉండదని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. బుధవారం నాడు ఏపీ అసెంబ్లీలో హెల్త్ యూనివర్శిటీ పేరు మార్పు పై జరిగిన చర్చలో జగన్ మాట్లాడుతూ ఎన్టీఆర్ తన కూతురిని గిఫ్ట్ గా ఇస్తే వెన్నుపోటును చంద్రబాబునాయుడు రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారని జగన్ సెటైర్లు వేశారు.
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు పై ఏపీ అసెంబ్లీలో రగడ చోటు చేసుకుంది. ఐదో రోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు చేపట్టారు. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు ఎలా మారుస్తారని టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
చంద్రబాబు సర్కార్ హయంలో స్టేట్ డేటా సెంటర్ నుండి డేటా చోరీ జరిగిందని ఏపీ శాసనసభ సంఘం తేల్చింది. కాల్ ట్యాపింగ్ నుంచి సమాచారం దొంగింలించారన్న కోణంలో తిరుపతి వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలోని ఈ కమిటీ విచారణ జరిపింది.
మహిళలకు స్వేచ్ఛ స్వాతంత్య్రాలు ఇవ్వాలని, వారికి రాజకీయాల్లో 50శాతం కట్టబెట్టేలా చట్టాలు తేవాలనుకొనే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలపై అసభ్య పదజాలంతో విరుచుకుపడే మంత్రి, ఫైర్ బ్రాండ్ రోజా మాటలు రాజకీయ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయి
ఏపీ అంసెబ్లీ సమావేశాలు నాలుగోరోజు వాడివేడిగా ప్రారంభం అయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు 3 బిల్లులకు ఆమోదం తెలిపింది. కాగా నేడు ఏడు బిల్లులను ఏపీ సర్కార్ సభలో ప్రవేశపెట్టింది. విద్య, వైద్యం, నాడు-నేడు పై సభలో చర్చ జరుగనుంది. శాసనసభ ముందుకు పెగాసెస్ నివేదిక కూడా నేడు రానుంది.
ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులు మరోసారి సస్పెండ్ అయ్యారు. సభలో కార్యక్రమాల నిర్వహణకు అడ్డుపడుతున్నారంటూ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సస్పెన్షన్ తీర్మానం ప్రతిపాదించగా, స్పీకర్ వారిని ఒక రోజు సభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా కోలగట్ల వీరభద్ర స్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గత శుక్రవారం కోలగట్ల ఒక్కరే నామినేషన్ వేయడంతో డిప్యూటీ స్పీకర్ ఎన్నిక లాంఛనం అయ్యింది. కోన రఘుపతి రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి కోలగట్లను ఎంపిక చేశారు.
మూడో రోజు అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో టిడిపి శాసనసభాపక్షం ''ఛలో అసెంబ్లీ'' పేరిట వినూత్న నిరసన చేపట్టింది. వ్యవసాయం, రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు మందడం నుండి అసెంబ్లీ ప్రాంగణం వరకు ఎడ్లబళ్లపై వెళ్లేందుకు నారా లోకేష్ తో సహా టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు.
ఏపీ అసెంబ్లీలో సోమవారం పోలవరం నిర్వాసితుల పరిహరం చెల్లింపు పై ప్రశ్నోత్తరాల సమయంలో జరిగిన చర్చలో టీడీపీ సీనియర్ సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మంత్రి అంబటి రాంబాబు మధ్య మాటల యుద్ధం నడిచింది.