Home / Andhra Pradesh
ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పు వివాదం పై ఎన్టీఆర్ భార్య లక్ష్మీపార్వతి స్పందించారు. ఎన్టీఆర్ పేరు మార్పు పై సీఎం జగన్ అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారని, అది ఎన్టీఆర్పై ద్వేషంతో చేసిన పని కాదన్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. కాగా నవరాత్రి ఉత్సవాల్లో తొలిరోజే భక్తులకు ఆలయంలో అసౌక్యం ఏర్పడింది. దుర్గగుడిలో కరెంట్ నిలిచిపోయింది. దాదాపు అరగంటకు పైగా కరెంట్ లేకపోవడం వల్ల భక్తులు, అర్చకులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
అనంతపురం జిల్లా గార్లదిన్నెలో ఈ దినం ఉదయం చోటుచేసుకొన్న రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు
నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల సమీపంలోని రామ్ కో సిమెంటు ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. కర్మాగారంలోని ఎత్తైన ర్యాంపులు కూలిపోవడంతో ఘటన చోటు చేసుకొనింది.
సీఎం జగన్మోహన్ రెడ్డి నటనలో ఎస్వీ రంగారావును మించిపోయాడని తెదేపా మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఘాటుగా విమర్శించారు. అనిత మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను మీడియా ముందుంచారు.
ప్రముఖ శక్తి దేవాలయంగా కీర్తింపబడుతున్న విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో రేపటినుండి దేవి నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. శరన్నవరాత్రుల్లో పది అవతారాలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తొలి రోజున రాష్ట్ర గవర్నర్ హరిచందన్ అమ్మవారిని దర్శించుకోనున్నారు.
ఇటీవల కాలంలో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుతో ఏపీలో రాజకీయ రగడ మొదలయ్యింది. ఈ విషయంపై అటు తెదేపా నేతలు సహా నందమూరి కుటుంబం మరియు అభిమానులు జగన్ ప్రభుత్వం పై ఘాటుగా స్పందిస్తున్నారు. కాగా తాజాగా వర్సిటీ పేరు మార్పు విషయంలో బాలకృష్ణ వ్యాఖ్యలపై మంత్రి రోజా ట్విట్టర్ ద్వారా స్పందించారు. తేడా వస్తే దబిడి దిబిడే అంటూ ట్వీట్ చేశారు.
పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్యశాఖల మంత్రి సిదిరి అప్పల్రాజు దిగ్భ్రాంతి చెందారు. అది కూడా ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, వైద్య విద్య శాఖ మంత్రి వి.రజినీ పాలనలోని ఓ ప్రభుత్వ వైద్యశాలను ఆయన తనిఖీ చేయడంతో అసలు వ్యవహారం బయటపడింది.
ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు.
కార్యకర్తల్ని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా కాలర్ ఎగరేస్తే ఎంతటి వారికైనా భంగ పాటు తప్పదు. అధికార పార్టీ నేతలకైతే కొమ్ములొచ్చాయా అనుకొనేలా వైకాపా ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలు స్వాగతం పలికిన ఆ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకొనింది.