Home / Andhra Pradesh
ఉద్యమాలతో దేశ స్వాతంత్య్రం వచ్చింది. ఉద్యమ స్పూర్తే ఎన్నో ప్రజా సమస్యలకు ఓ చుక్కాని. ఉద్యమ ఉద్దేశాన్ని ఎన్ని అడ్డంకులు సృష్టించినా దాని ప్రభావం అంతకు అంత పెరుగుతుందే గాని తగ్గదు.
కార్యకర్తల్ని, ప్రజా ప్రతినిధులను పట్టించుకోకుండా కాలర్ ఎగరేస్తే ఎంతటి వారికైనా భంగ పాటు తప్పదు. అధికార పార్టీ నేతలకైతే కొమ్ములొచ్చాయా అనుకొనేలా వైకాపా ఎమ్మెల్యేకు గో బ్యాక్ నినాదాలు స్వాగతం పలికిన ఆ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకొనింది.
విశ్వవిద్యాలయానికి ఎన్టీఆర్ పేరు మార్చడంపై బాలకృష్ణ స్పందించారు. మార్చటానికి, తీసేయ్యడానికి ఎన్టీఆర్ అన్నది పేరు కాదని, తెలుగు జాతి వెన్నెముక అని ట్వీట్ చేశారు.
గత కొద్దిరోజులుగా అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మరల అమరావతి వాతావరణ కేంద్రం ఏపీకి మరో మూడురోజుల పాటు వర్ష సూచన ఉందని తెలిపింది. నేడు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొనింది.
ఎమ్మెల్సీ అనంతబాబుకు రాజమహేంద్రవరం కోర్టు మరోమారు రిమాండ్ ను పొడిగించింది. ఇదివరకు విధించిన రిమాండ్ గడువు శుక్రవారంతో పూర్తి కావడంతో పోలీసులు ఆయనను రాజమహేంద్రవరంలోని ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కోర్టులో ప్రవేశపెట్టారు.
ఏపీ సీఎం జగన్ టీడీపీ అధినేత చంద్రబాబు కంచుకోటలో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి అయిన తరువాత తొలి సారి జగన్ కుప్పంకు రానున్నారు. సీఎం పర్యటనకు భారీ ఏర్పాట్లు చేసారు. వచ్చే ఎన్నికల పైన ఇప్పటికే ఫోకస్ చేసిన సీఎం జగన్ 175 సీట్లలో విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్నారు.
రాష్ట్రంలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై నిషేదం విధించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకొనింది. పర్యావరణ పరిరక్షణ ధ్యేయానికి వ్యతిరేకంగా ఎవరైనా ప్లాస్టిక్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే అడుగుకు రూ. 100 ఫైన్ వేయనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.
హిందూపురం పురపాలక సంఘ కార్యాలయంలో పనిచేస్తున్న రెవిన్యూ ఇన్స్ పెక్టర్ షఫీఉల్లా ఏసిబీ వలలో చిక్కారు. 15వేల లంచం తీసుకొంటూ ఏసిబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు
తెలుగు వారు ఏ రంగంలోనై రాణించగలరు ఎన్ని రికార్డులైనా నెలకొల్పగలరు అన్నది నానుడి కాదండో అక్షరాల నిజం. సంపద సృష్టిలో తెలుగువాళ్లు రికార్డులు మీద రికార్డులు సృష్టిస్తున్నారు. ఐఐఎఫ్ఎల్ వెల్త్ హురూన్ రిచ్లిస్ట్-2022లో మెరుగైన ర్యాంకులన్నీ మన తెలుగువారే సాధించారు.
జగన్ కు ఈసీ మొట్టికాయలు..క్లారిటీ ఇచ్చిన వైసీపీ నేత..కోర్టులో ఈసీకి సర్కార్ సవాల్..?