Home / పొలిటికల్ వార్తలు
అమరావతి రైతులు తాము చేస్తున్న పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చారు. .పోలీసుల తీరుకు నిరసనగా పాదయాత్రను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టుగా అమరావతి జేఏసీ ప్రకటించింది.
ఏడేళ్లకిందట ఏపీ రాజధానిగా అమరావతి కి ప్రధాని మోదీ శంకుస్దాపన చేస్తే పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనమయిందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేసారు.
కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ నుంచి బరిలో నిలవగా, తమ్ముడికి పరోక్షంగా మద్దతు తెలుపుతున్నారు.
అన్నదాతలను కేసీఆర్ సర్కార్ కంట నీరు పెట్టిస్తున్నారని భాజపా నాయకురాలు విజయశాంతి అధికార పార్టీపై ధ్వజమెత్తారు. నకిలీ విత్తనాలు, భారీ వర్షా భావంతో రైతులు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మేమే శాశ్వతం, మాదే రాజ్యం అనే ధోరణిలో వైకాపా నేతలు రెచ్చిపోతున్నారని, అధికారం శాశ్వతం కాదని గుర్తు పెట్టుకోవాలని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటి సభ్యుడు కొణిదెల నాగబాబు హెచ్చరించారు.
ఉప ఎన్నికల నేపథ్యంలో మంత్రి కేటిఆర్ రోడ్ షోలో పాల్గొననున్నారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ భాజపా పై గురిపెట్టింది. భాజపాకు చెక్ పెట్టేందుకు ఆ పార్టీలోని కీలక నేతల్ని తమ పార్టీలోకి చేర్చుకొంటున్నారు. ఒకే రోజు భాజపాకు చెందిన స్వామి గౌడ్, దాసోజి శ్రవణ్ లు ఆ పార్టీకి గుడ్ బై చెప్పి గులాబీ పార్టీ తీర్ధం పుచ్చుకొన్నారు.
రాజకీయ నాయకులు ఓ పార్టీలో ఉంటూ మరో పార్టీకి ఓటెయ్యమంటారని ఇప్పటివరకు అందరూ వింటుంటారు. అయితే అది నేరుగా వినేవారు చాలా తక్కువగా ఉంటారు. అలాంటి ఓ ఆడియో తెలంగాణ కాంగ్రెస్ లో పెనుదుమారం లేపుతుంది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీ ప్రజలకు పార్లమెంటులో చేసిన చట్టాలు అందలేదని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కులం, మతం, భాష, ఆహార, వేషధారణల ఆధారంగా భారతీయులను ఒకరికొకరు ఇరకాటంలో పెట్టే ప్రయత్నం సాగుతున్న నేటి తరుణంలో కాంగ్రెస్ పార్టీ భారత్ జోడో యాత్ర చేపట్టింది.
ఏపీలో పోలీసులు ప్రభుత్వ పోలిసింగ్ గా మారారని ఆరోపిస్తున్న ప్రతిపక్షాల వ్యాఖ్యలను నిజమేనని అనుకొనేలా కొన్ని సంఘటనలు అద్దం పడుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన కార్యకర్తలపై పోలీసులు కక్షపూరితంగా వ్యవహరించారు.