Home / జాతీయం
దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత సూచీలు దారుణంగా క్షీణిస్తున్నాయి. కాలుష్యం విపరీతంగా పెరగడంతో దిల్లీ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో కాలుష్య నియంత్రణకు ఆమ్ ఆద్మీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీపావళి తర్వాతి రోజు నుంచి మళ్లీ ‘సరి-బేసి విధానాన్ని అమల్లోకి తీసుకురానున్నట్లు ఢిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్ రాయ్ వెల్లడించారు.
సుప్రీంకోర్టు సోమవారం నాడు పలు రాష్ట్రాల గవర్నర్లపై ఆగ్రహం వ్యక్తం చేసింది. శాసనసభ ఆమోదించిన బిల్లులను ఎందుకు నాన్చుతున్నారని ప్రశ్నించింది. కాగా పంజాబ్ ప్రభుత్వం గవర్నర్ భన్వారీలాల్కు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది
కేరళలోని ఒక పెంపుడు కుక్క కన్నూర్ జిల్లా ఆసుపత్రిలోని మార్చురీ ముందు తన యజమాని కోసం వేచి ఉంది. అక్కడ గత నాలుగు నెలలు కిందట మరణించిన తన యజమాని తిరిగి వస్తాడని భావిస్తూ అక్కడే తిరుగుతోంది. ఆసుపత్రి ఉద్యగులు అక్కడికి వచ్చేవారు కుక్క కు తన యజమాని పట్ల ఉన్న ప్రేమకు విస్తుపోతున్నారు.
: సాయుధ దళాలలోని మహిళా సైనికులు, నావికులు మరియు వైమానిక దళంలో పనిచేసే మహిళలకు అధికారులతో సమానంగా ప్రసూతి, శిశు సంరక్షణ మరియు పిల్లల దత్తత సెలవుల నిబంధనలను పొడిగించే ప్రతిపాదనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆమోదించారు
దేశ రాజధాని ఢిల్లీలోని అన్ని ప్రాథమిక పాఠశాలలను నవంబర్ 10 వరకు మూసివేయాలని ఢిల్లీ ప్రభుత్వం ఆదేశించింది. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి మరియు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేత అతిషి ఆదివారం X (గతంలో ట్విట్టర్)లో ఈ ప్రకటన చేశారు.
Delhi: ఢిల్లీలో మరోసారి కాలుష్య తీవ్రత ప్రమాదస్థాయికి చేరింది. శుక్రవారం తెల్లవారుజామున నగరంలోని చాలా ప్రాంతాల్లో గాలి నాణ్యత ‘తీవ్ర ప్రమాదస్థాయి’కి చేరుకుంది. మొత్తంగా సెంట్రల్ పొల్యూషన్ బోర్డు గణాంకాల ప్రకారం వాయునాణ్యత సూచీ 346గా నమోదయింది.
బిగ్ బాస్ OTT 2 విజేత మరియు యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ నిర్వహించిన రేవ్ పార్టీలకు పాములు, వాటి విషాన్ని సరఫరా చేసినందుకు ఐదుగురు వ్యక్తులను నోయిడాలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.ఢిల్లీ మరియు దాని పరిసర ప్రాంతాల్లోని వివిధ ఫామ్హౌస్లలో ఈ పార్టీలు నిర్వహించారు.
దేశంలోని రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చేందుకు ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ చెల్లుబాటు పిటిషన్ పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎలక్టోరల్ బాండ్స్ పిటిషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా, ప్రతిపక్ష ఎంపీలు క్యాష్ ఫర్ క్వరీ అంశంపై పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశం నుంచి వాకౌట్ చేసారు. కమిటీ శ్రీమతి మొయిత్రాను వ్యక్తిగత మరియు అనైతిక ప్రశ్నలు అడిగారని ప్రతిపక్ష ఎంపీలు చెప్పారు.
కర్ణాటక చిక్కబళ్లాపూర్ జిల్లాలో ప్రాణాంతక జికా వైరస్ను గుర్తించడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ఆరోగ్య అధికారులు కూడా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి, ప్రారంభ దశలో సంక్షోభాన్ని తగ్గించేందుకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు