Home / జాతీయం
సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గులాం నబీ ఆజాద్ కాంగ్రెస్ జమ్మూ మరియు కాశ్మీర్ కమిటీ ఛైర్మన్ పదవి నుండి వైదొలిగారు. తనకు ఈ పదవికి అవకాశం ఇచ్చినందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఆజాద్ చెప్పినప్పటికీ,
ఎఐఎడిఎంకె ప్రధాన కార్యదర్శి ఇ పళనిస్వామికి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీలో ద్వంద్వ నాయకత్వాన్ని పునరుద్ధరిస్తూ ఆయన బద్ధ ప్రత్యర్థి పన్నీర్ సెల్వంకు అనుకూలంగా మద్రాసు హైకోర్టు తీర్పునిచ్చింది.
రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ట్రిపుల్ తలాక్పై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ముస్లిమ్ మహిళలకు తలాక్ ద్వారా విడాకులు ఇవ్వటాన్ని తప్పుపట్టలేమని తెలిపింది. అయితే ఒకే సారి కాకుండా, నెలకోసారి చొప్పున మూడు సార్లు తలాక్ చెప్పి విడాకులు తీసుకోవడం నేరం కాదని తేల్చింది.
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.
భారతదేశం 2022 ఆగస్టు 15న 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇచ్చిన "హర్ ఘర్ తిరంగ" పిలుపును దేశప్రజలు స్వీకరించారు. ఈ ఏడాది 30 కోట్లకు పైగా జాతీయ జెండాల విక్రయం ద్వారా దాదాపు రూ. 500 కోట్ల ఆదాయం సమకూరిందని అఖిల భారత వ్యాపారుల సమాఖ్య
విశిష్ట గుర్తింపు అథారిటీ (UIDAI) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుండి జూలై వరకు మొదటి నాలుగు నెలల్లో 5 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 79 లక్షల మంది పిల్లలను నమోదు చేసింది. వీరికి బాల్ ఆధార్ కార్డులు మంజూరు చేయడం జరిగింది.
బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కూటమి భాగస్వామి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎక్కువ మంత్రిపదవులు లభించాయి. కాంగ్రెస్తో సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులను
కర్ణాటకలోని బీదర్ జిల్లా బంగూర్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి వెనకనుంచి కంటైనర్ వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా మరో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ఆయన కుటుంబ సభ్యులను చంపేస్తామంటూ బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. అంబానీ కుటుంబాన్ని బెదిరిస్తూ ... రిలయన్స్ ఫౌండేషన్ ఆసుపత్రికి ఈ రోజు ఉదయం ఆగంతకుడు నాలుగు సార్లు ఫోన్ చేశాడు.