Last Updated:

Jacqueline Fernandez: రూ.215 కోట్ల వసూళ్ల కేసులో జాక్వెలిన్ పై ఈడీ చార్జిషీటు

రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

Jacqueline Fernandez: రూ.215 కోట్ల వసూళ్ల కేసులో జాక్వెలిన్ పై ఈడీ చార్జిషీటు

Bollywood: రూ.215 కోట్ల వసూళ్ల కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌ను నిందితురాలిగా పేర్కొంది. ఆమె పై ఈడీ బుధవారం చార్జిషీట్ దాఖలు చేసింది. బలవంతంగా వసూలు చేసిన సొమ్ములో జాక్వెలిన్ లబ్ధిదారునిగా ఈడీ గుర్తించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ కేసులో నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ దోపిడీదారుడని ఆమెకు తెలుసునని ఈడీ విశ్వసిస్తోంది. వీడియో కాల్స్‌లో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సుకేష్‌తో నిరంతరం టచ్‌లో ఉన్నట్లు కీలక సాక్షులు మరియు నిందితుల వాంగ్మూలాలు వెల్లడిస్తున్నాయి. జాక్వెలిన్ కు బహుమతులు ఇచ్చినట్లు సుకేష్ అంగీకరించాడు.గతంలో సుకేష్ ఆమెకు రూ.10 కోట్ల విలువైన బహుమతులు పంపినట్లు ఈడీ గుర్తించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద ఈడీ ఇప్పటివరకు రూ.7 కోట్లకు పైగా విలువైన సుకేశ్ ఆస్తులను అటాచ్ చేసింది. జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు సుకేశ్ చంద్రశేఖర్‌తో సంబంధాలున్నాయంటూ ఈడీ పలుమార్లు ప్రశ్నించింది.

సుకేశ్ చంద్రశేఖర్‌పై ఉన్న 32కి పైగా క్రిమినల్ కేసుల్లో అనేక రాష్ట్ర పోలీసులు మరియు మూడు కేంద్ర ఏజెన్సీలు, సిబిఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మరియు ఇన్‌కమ్ టాక్స్ దర్యాప్తు చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఓ వ్యాపారి భార్య నుంచి స్పూఫ్ కాల్స్ ద్వారా రూ.215 కోట్లు వసూలు చేసినట్లు సుకేష్ చంద్రశేఖర్ పై ఆరోపణలు ఉన్నాయి. సుకేష్ ఢిల్లీ జైలులో ఉండగా, ప్రధాని కార్యాలయం, న్యాయశాఖ, హోంశాఖకు చెందిన అధికారిగా నటిస్తూ బాధితురాలి నుంచి డబ్బులు వసూలు చేశాడు. బాధితురాలి భర్తకు బెయిల్ ఇప్పిస్తానని, తమ ఫార్మాస్యూటికల్ వ్యాపారాన్ని నడిపిస్తానని సుకేష్ ఫోన్ కాల్స్‌లో పేర్కొన్నాడు. రాజకీయ నాయకుడు టీటీవీ దినకరన్‌కు సంబంధించిన ఐదేళ్ల నాటి చీటింగ్ కేసులో కూడా సుకేష్ ప్రమేయం ఉంది. ఈ కేసుకు సంబంధించి ఏప్రిల్ 4న అతడిని ఈడీ అరెస్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి: