Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్లో లోయలోపడిన బస్సు.. ఏడుగురు ఐటిబిపి జవాన్ల మృతి
మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.

Jammu Kashmir: మంగళవారం జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ ప్రాంతంలో ఒక బస్సు లోయలో పడిపోవడంతో ఏడుగురు ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) సిబ్బంది మరణించగా, అమర్నాథ్ యాత్రకు వెళ్లి తిరిగి వస్తున్న 32 మంది గాయపడ్డారు.
చందన్వారి-పహల్గాం మధ్య లోయలో బస్సు పడిపోయింది. ఏడుగురు ఐటీబీపీ సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా, మరికొంతమందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో దాదాపు 20 మంది ఐటీబీపీ సిబ్బందితో పాటు ఇద్దరు పోలీసులు కూడా గాయపడ్డారు. క్షతగాత్రులను తరలించేందుకు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్) హెలికాప్టర్ను రంగంలోకి దించారు.