Last Updated:

Bihar Cabinet Expansion: బీహార్ మంత్రివర్గ విస్తరణ.. ఆర్జేడీకి పెద్ద పీట

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కూటమి భాగస్వామి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎక్కువ మంత్రిపదవులు లభించాయి. కాంగ్రెస్‌తో సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులను

Bihar Cabinet Expansion: బీహార్ మంత్రివర్గ విస్తరణ.. ఆర్జేడీకి పెద్ద పీట

Bihar: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఈరోజు తన మంత్రివర్గాన్ని విస్తరించారు. కూటమి భాగస్వామి రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ)కి ఎక్కువ మంత్రిపదవులు లభించాయి. కాంగ్రెస్‌తో సహా మహాఘటబంధన్ లేదా మహాకూటమిలో భాగమైన వివిధ పార్టీల నుండి మొత్తం 31 మంది మంత్రులను ఈరోజు మంత్రివర్గంలోకి తీసుకున్నారు.ఆర్జేడీకి దాదాపు 16 మంత్రి పదవులు లభించాయి, ఆ తర్వాత జనతాదళ్ (యునైటెడ్ నుంచి ) 11 మంది మంత్రులు ఉన్నారు. కాంగ్రెస్‌కు చెందిన ఇద్దరు శాసనసభ్యులు, జితిన్ రామ్ మాంఝీ యొక్క హిందుస్థానీ అవామ్ మోర్చా నుండి ఒకరు మరియు ఏకైక స్వతంత్ర ఎమ్మెల్యే సుమిత్ కుమార్ సింగ్ కూడా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.

నితీష్ కుమార్ తన పాత మంత్రులు అశోక్ చౌదరి, లేషి సింగ్, విజయ్ కుమార్ చౌదరి, సంజయ్ ఝా, షీలా కుమారి, సునీల్ కుమార్ మదన్ సాహ్ని మరియు బిజేంద్ర యాదవ్‌లను ఈ క్యాబినెట్లో కూడ కొనసాగించారు.ఆర్జేడీ నుంచి తేజ్ ప్రతాప్ యాదవ్, అలోక్ మెహతా, సురేంద్ర ప్రసాద్ యాదవ్ మరియు రామానంద్ యాదవ్, కుమార్ సర్వజీత్, సమీర్ కుమార్ మహాసేత్, చంద్రశేఖర్ మరియు లలిత్ యాదవ్ క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్‌ నుంచి అఫాక్‌ ఆలం, మురారీ లాల్‌ గౌతమ్‌లు మంత్రివర్గంలోకి చేరగా, హిందుస్థానీ అవామ్‌ మోర్చాకు చెందిన సంతోష్‌సుమన్‌ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. బీహార్ కేబినెట్‌లో ముఖ్యమంత్రితో సహా 36 మంది మంత్రులు ఉండవచ్చు. భవిష్యత్తులో జరిగే మంత్రివర్గ విస్తరణలో మరికొంతమందికి మంత్రిపదవులు లభించే అవకాశముంది.

ఇవి కూడా చదవండి: