Home / జాతీయం
అయోధ్యలో శ్రీ రాముని ప్రాణ ప్రతిష్ట తర్వాత భారతీయ జనతాపార్టీ సీతమ్మకు దేవాలయం కట్టి ఓట్లు దండుకోవాలనుకుంటోంది. ప్రస్తుతం లోకసభ ఎన్నికల సీజన్ కొనసాగుతోంది. ఐదవ విడత ప్రచారం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిహార్లో పర్యటిస్తున్నారు.
ఉత్తరాదిని ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఒక వైపు ఎన్నికలు మరో వైపు ఎండలు రాజకీయ నాయకులను ఉక్కరిబిక్కిర చేస్తున్నాయి. ఢిల్లీ, పంజాబ్, హర్యానా, యూపీల్లో పగటి ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ దాటే అవకాశం ఉంది. శనివారం నాడు దేశ రాజధాని న్యూఢిల్లీలో ఉష్ణోగ్రత 45 డిగ్రీలు సెల్సియస్ నమోదు అవుతుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
న్యూఢిల్లీ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు ఈ - మెయిల్ రావడంతో పెద్ద కలకలం ఏర్పడింది. విమానంలోని లావెట్రీలో ఓ టిష్యూ పేపరుపై విమానంలో బాంబు పెట్టినట్లు రాసి ఉన్న పేపర్ లభించింది.
కేంద్ర పౌర విమానయానశాఖమంత్రి జ్యోతిర్యాధిత్య సింధియా తల్లి మాధవి రాజే సింధియా బుధవారం ఉదయం 9.28 గంటలకు న్యూఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో కన్ను మూశారని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. ఆమె గత మూడు నెలల నుంచి ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. కాగా జల్ విలాస్ ప్యాలెస్ అధికారులు మాత్రం గురువారం నాడు ఆమె అంత్యక్రియలు జరుగుతాయని ప్రకటించారు.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై కేంద్ర విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ స్పందించారు. పీఓకే భారత్లో భాగమే అని మరోమారు నొక్కి చెప్పారు. పాక్ ఆక్రమిత జమ్ము కశ్మీర్ భారత్లో అంతర్బాగమేనని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం అక్కడ హింసాత్మక ఘటనలకు దారితీయడానికి ప్రధాన కారణం పెరిగిపోతున్న ద్రవ్యోల్బణమే అని అన్నారు.
న్యూస్క్లిక్ వ్యవస్థాపక ఎడిటర్ ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని.. తక్షణమే విడుదల చేయాలని బుధవారం నాడు సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. సుప్రీంకోర్టు ధర్మాసనం జడ్జిలు బీఆర్ గవాయి, సందీప్ మెహతాలతో కూడిన న్యూస్ క్లిక్ ఎడిటర్ అరెస్టుకు సంబంధించి రిమాండ్ కాపీ తమకు అందజేయలేదని, కాబట్టి ప్రబీర్ పురకాయస్థ అరెస్టు చెల్లుబాటు కాదని తేల్చి చెప్పింది.
ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్వీ అశోకన్ క్షమాపణల పట్ల సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టుకు వ్యతిరేకంగా అశోకన్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కోర్టుకు వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది.
OTT Platform:కేంద్రప్రభుత్వం వచ్చే ఆగస్టు నాటికి వీటికి పోటీగా సొంత ఒటీటీ ఫ్లాట్ఫాంను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కేంద్రప్రభుత్వం దీని బాద్యతను పబ్లిక్ సర్వీస్ బ్రాడ్క్యాస్టర్ ప్రసారభారతికి అప్పగించింది. ప్రసార భారతి దేశీయ ఓటిటికి రంగం సిద్దం చేస్తోంది. దేశీయ ఓటీటీ నెట్ ఫ్లిక్స్తో పాటు హాట్స్టార్కు పోటీ ఇవ్వబోతోంది. ఇక కంటెంట్ విషయానికి వస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను ప్రమోట్ చేస్తుంది. ఆగస్టులో అందుబాటులోకి వచ్చే ఓటీటీ ప్రారంభంలో ఒకటి, రెండు సంవత్సరాల పాటు ఉచితంగా […]
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ రిమాండ్ను ఢిల్లీ లోని రౌస్ అవెన్యు కోర్టు మరోసారి పొడిగించింది. మరో ఆరు రోజులపాటు అంటే మే 20 వరకు పొడిగిస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. తదుపరి విచారణను మే 20కు వాయిదా వేసింది.
దొంగలు మామూలు బస్సులు, రైలు ప్రయాణాల్లోనే కాదు... విమానాల్లో కూడా ఉంటారని తాజా సంఘటన రుజువు చేస్తోంది. ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి ఏడాదికి 200 సార్లు విమానాల్లో ప్రయాణించి ప్రయాణికుల ఖరీదైన వస్తువులు కొట్టేసేవాడు.