Home / జాతీయం
మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత చంద్రబాబుకు బాంబే హైకోర్టు లో చుక్కెదురైంది . 2010 జూలైలో మహారాష్ట్రలో పోలీసు సిబ్బందిపై దాడికి సంబందించిన కేసును కొట్టేయాలని చంద్రబాబు, టీడీపీ నేత మాజీ మంత్రి నక్కా ఆనందబాబు దాఖలు చేసిన పిటిషన్ను బాంబే హైకోర్టు ఔరంగాబాద్ బెంచ్ తోసిపుచ్చింది .
ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం వారణాసిలో నామినేషన్ వేశారు . వారణాసి నుంచి లోక్ సభ కు మోడీ పోటీచేస్తున్న విషయం తెలిసిందే . మోదీ నామినేషన్ కార్యక్రమాని ఎన్డీయే మిత్ర పక్ష నాయకులు సైతం హాజరయ్యారు .
ముంబైలో హోర్డింగ్ జారిపడిన ఘటనలో 14 మంది మరణించగా 70 మందికి పైగా గాయపడ్డారు.ముంబయిలోని ఘట్కోపర్ ప్రాంతంలోని పెట్రోల్ పంపు పక్కన ఉన్న 100 అడుగుల హోర్డింగ్ తుఫాను గాలులకు కిందకు పడిపోవడంతో దీనికింద ఉన్న కార్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ కార్లలో పలువురు చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలీవాల్ తనపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆయన అనుచరుడు దాడి చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా ఢిల్లీ పోలీసులకు సోమవార ఉదయం ఓ కాల్ వచ్చింది. ఆ కాల్లో ఆమ్ఆద్మీపార్టీకి చెందిన నాయకురాలు, రాజ్యసభ ఎంపీ స్వాతిమలీవాల్పై దాడి జరిగిందని సమాచారం ఇచ్చారు
నాలుగవ విడత లోకసభ ఎన్నికల ఓటింగ్ క్రమంగా జోరుందుకుంటోంది. మొత్తం తొమ్మిది రాష్ర్టాల్లో ఒక కేంద్ర ప్రాలిత ప్రాంతంతో సహా మొత్తం 96 నియోజకవర్గాల్లో ఉదయం 11 గంటల వరకు చూస్తే ఓటింగ్ 24.87 శాతంగా నమోదైందని ఎన్నికల కమిషన్ విడుదల చేసిన గణాంకాలను బట్టి తెలుస్తోంది.
బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా, ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీకి మధ్య మాటల యుద్ధం ముగిసేట్లు కనిపించడం లేదు. కాగా శనివారం నాడు నవనీత్ రాణా మరోమారు ఓవైసీని ఉద్దేశించి కొత్త వీడియోను విడుదల చేశారు. దేశంలోని ప్రతి గల్లిలో రామభక్తులు తిరుగుతున్నారని గుర్తు చేశారు
దేశవ్యాప్తంగా ఎన్నికల హీట్ పీక్కు చేరుకుంది. సోమవారం నాడు మూడవ విడత పోలింగ్ జరుగనుంది. అధికార, ప్రతిపక్ష పార్టీలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నాయి. ఇక ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం కాంగ్రెస్ పార్టీపై ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం సాయంత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మధ్యంతర బెయిల్పై బయటికి వచ్చారు. కాగా శనివారం నాడు ఆయన కన్నాట్ప్లేస్లోని హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ఆయన వెంట భార్య సునీతా కేజ్రీవాల్, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్మాన్, ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్తో పాటు ఢిల్లీ మంత్రి అతిషి వెంట వచ్చారు.
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీతో పాటు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరంలోని పలు స్కూళ్లకు ఈ- మెయిల్ ద్వారా బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే. తీరా స్కూళ్లకు సెలవు ప్రకటించి.. బాంబు కోసం గాలింపు చేపడితే ... అది కేవలం బెదరింపు ఈ మెయిల్ అని తేలింది
కర్ణాటకలో దారుణం చోటు చేసుకుంది. పెళ్లి చేసుకోబోతున్న టీనేజ్ అమ్మాయి తలనరికి .. తలను తీసుకొని పారిపోయిన అత్యంత కిరాతకమైన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... 16 ఏళ్ల మీనా అనే టీనేజ్ బాలికను 32 ఏళ్ల వ్యక్తి గురువారం నాడు వివాహం చేసుకోవాల్సింది. అయితే అధికారులు వివాహ వేదిక వద్దకు వచ్చి పెళ్లి నిలిపివేయించారు